బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి హిందీ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో సల్మాన్ భారీ స్థాయి విజయాలను అందుకోలేదు. ఆఖరుగా సల్మాన్ "టైగర్ 3" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ , ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సికిందర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ మూవీ లో మరో హీరోయిన్ పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్ "ఫిర్ మిలింగే" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో సల్మాన్ హెచ్ఐవి వ్యాధి సోకిన వ్యక్తి పాత్రలో నటించాడు. ఈ మూవీ లో శిల్పా శెట్టి హీరోయిన్గా నటించగా ... అభిషేక్ బచ్చన్మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఈ మూవీ కి విమర్శకుల నుండి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన శైలేంద్ర సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

అసలు విషయం లోకి వెళితే ... శైలేంద్ర సింగ్ తాజాగా మాట్లాడుతూ ... సల్మాన్ ఖాన్ "ఫిర్ మిలెంగే" సినిమాలో నటించడానికి కేవలం ఒక్క రూపాయి మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో హెచ్ఐవి పేషెంట్ పాత్రలో నటించడానికి ఒప్పుకోవద్దని బాలీవుడ్ మొత్తం చెప్పింది. అయిన ఎవరి మాట వినకుండా సల్మాన్ పాత్ర చేశాడు అని శైలేంద్ర సింగ్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ మూవీకి రేవతి దర్శకత్వం వహించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: