మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగు సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కెరీర్ను కొనసాగించింది. కానీ ప్రస్తుతం మాత్రం తెలుగు సినిమాలు చేయడం లేదు. ఈమె ఆఖరిగా కొండపొలం అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ ఏ తెలుగు సినిమాలో కూడా నటించలేదు. ప్రస్తుతం కూడా ఏ తెలుగు మూవీలలో రకుల్ నటించడం లేదు.

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో ఈమె అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. అందులో భాగంగా ఆమెకు ఓ బాలీవుడ్ సినిమాలో ఆఫర్ వచ్చినట్లు , అది మరో తెలుగు మూవీ వల్ల వదులుకోవాల్సి వచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఆ మూవీ మూవీ ..? ఏది ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రకుల్ మాట్లాడుతూ ... నాకు ఎం ఎస్ ధోని జీవిత కథ ఆధారంగా రూపొందిన ధోనీ ఆన్ టోల్డ్ స్టోరీ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ఆఫర్ వచ్చిన సమయానికి నేను రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న బ్రూస్ లీ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నాను.

ఇక అప్పటికి ఆ సినిమాకు సంబంధించిన రెండు పాటల షూటింగ్ పెండింగ్లో ఉంది. దానితో నేను ఆ సినిమా చేయలేకపోయాను అని రకుల్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం రకుల్ తమిళ్ , హిందీ సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తుంది. ఈమె ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించిన భారీ బ్లాక్ బాస్టర్ విజయం మాత్రం ఈమె కు హిందీ సినీ పరిశ్రమలో దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: