టాలీవుడ్ యువ నటుడు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ అనే సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. అక్కినేని నాగేశ్వరరావు మనవడు కావడం , అక్కినేని నాగార్జున కొడుకు కావడం వల్ల ఈయన నటించిన మొదటి సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత కూడా ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి. ఆఖరుగా అఖిల్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ కూడా భారీ అంచనాలు నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే అఖిల్ నెక్స్ట్ మూవీ ని యువి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించనున్నట్లు , ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. కాకపోతే తాజాగా అఖిల్ నెక్స్ట్ మూవీ కి సంబంధించిన మరో వార్త బయటకు వచ్చింది. అఖిల్ నెక్స్ట్ మూవీ ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించనున్నట్లు , ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు స్టార్ట్ అయినట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అఖిల్ కొంత కాలం క్రితం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే మూవీ లో హీరో గా నటించిన ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: