ఈ మధ్యకాలంలో అనేక సినిమాలు రీ రిలీస్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా రీ రిలీస్ అవుతున్న సినిమాలలో కొన్ని సినిమాలుకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. దానితో మరిన్ని సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే కేవలం సెప్టెంబర్ నెలలో రెండు రోజుల్లోనే నాలుగు సినిమాలు రీ రిలీస్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ తేదీన రీ రిలీజ్ కాబోతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

శివాజీ : రజనీ కాంత్ హీరోగా శ్రేయ హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 20 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

బొమ్మరిల్లు : సిద్ధార్థ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 21 వ తేదీన రీ రిలీస్ చేయనున్నారు. మరి ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఎలాంటి కనెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

వెంకీ : మాస్ మహారాజా రవితేజ హీరోగా స్నేహ హీరోయిన్గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 21 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. మరి ఈ మూవీ రీ రిలీజ్ లో ఎలాంటి ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపిస్తుందో చూడాలి.

జర్నీ : శర్వానంద్ , జై , అంజలి , అనన్య ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 21 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

ఇలా సెప్టెంబర్ 20 , 21 రెండు తేదీల్లోనే నాలుగు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో ఏ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: