టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి ఒక ఇంటి వారు అవుతున్నారు. మొన్న కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు చాలామంది టాలీవుడ్ హీరోలు అలాగే హీరోయిన్లు... పెళ్లి పీటలు ఎక్కిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా మరో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన జంట పెళ్లి పీటలు ఎక్కింది.


ఎవరికి తెలియకుండా ఈ టాలీవుడ్ హీరో మరియు టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరు ఎవరో కాదు టాలీవుడ్ హీరో సిద్ధార్థ మరియు అతిధి రావు.  సిద్ధార్థ అలాగే అతిథి రావు గత కొన్ని  రోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. గత ఆరు నెలల కిందట...  సిద్ధార్థ అలాగే అతిధి రావు హైదరి... ఇద్దరూ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నారు.


అప్పుడు కూడా చాలా రహస్యంగా తమ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ టాలీవుడ్ జంట. అయితే సరిగ్గా ఆరు నెల తర్వాత హీరో సిద్ధార్థ లాగే అతిధి రావు హైదరి... పెళ్లి పీటలు ఎక్కారు. సౌత్ ఇండియన్ స్టైల్ లో హీరో సిద్ధార్థ లాగే అతిధి రావు హైదరి పెళ్లి జరిగింది. అయితే వీరిద్దరి పెళ్లి గురించి ముందుగా ఇలాంటి ప్రకటన చేయకుండా చాలా రహస్యంగా... వివాహం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది.


ఇరు కుటుంబ సభ్యులు అలాగే మరికొంతమంది సన్నిహితుల సమక్షంలోనే.. టాలీవుడ్ హీరోయిన్  హైదరీకి..  హీరో సిద్ధార్థ మంగళసూత్రం కట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను హీరోయిన్ హైదరి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరికీ తెలిసిపోయింది. ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టింది హైదరి. నా సూర్యుడు నువ్వే నా చంద్రుడు నువ్వే అంటూ... సిద్ధార్థ ను.. తెగ పొగిడేసింది హీరోయిన్ హైదరి. ఇక ఈ ఫోటోలు చూసిన నేటిజెన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా హీరో సిద్ధార్థ కు ఇదే రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: