SMS సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది హీరోయిన్ రెజీనా. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కొత్తజంట రారా కృష్ణయ్య, పవర్, ఆ, తదితర చిత్రాలలో నటించింది. అయితే ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటించే రెజినా ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇటీవలే ఉత్సాహం అనే సినిమాతో తిరిగి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అర్జున్ సాయి దర్శకత్వం వహించారు.


సెప్టెంబర్ 13న గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెజీనా తన బ్రేకప్ ల గురించి తెలియజేస్తూ అలాగే తన వ్యక్తిగత జీవితం పై జరిగిన కొన్ని రూమర్స్ పైన కూడా స్పందించింది. ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు హీరో సాయి దుర్గా తేజ తో వివాహం పైన వచ్చిన రూమర్ల పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది.. రెజీనా మాట్లాడుతూ సాయి తేజ్ తనకు మంచి మిత్రుడు మాత్రమే అని.. తమ మధ్య ఎలాంటిది లేదంటు తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.


అయితే కొంత మంది కేవలం మా మధ్య ఏదో ఉన్నట్లుగా కొన్ని రూమర్స్ సృష్టించారు. కొందరు మా మధ్య ఉన్న సన్నిహిత్యాన్ని చూసి ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నారని కేవలం  పుకార్లు సృష్టించారని ఇందులో ఎలాంటి నిజం లేదంటే తెలియజేసింది. దీంతో ఇప్పటికైనా మాపైన  వస్తున్న రూమర్లకు బ్రేక్ పడుతుంది ఆశిస్తున్నానంటూ రెజీనా వెల్లడించింది. మరి ఈ విషయాలకు బ్రేక్ పడుతుందేమో  మరి.. అయితే గతంలో కూడా సాయి ధరంతేజ్  ఒక హీరోయిన్ తో ప్రేమలో పడ్డట్టుగా వార్తలు వినిపించాయి.. తిక్క సినిమా హీరోయిన్ తో ప్రేమలో పడ్డట్టుగా అప్పట్లో వార్తలు వినిపించిన మెగా కుటుంబానికి ఆమె నచ్చక పోవడంతో వదిలేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె సాయి ధరంతేజ్ కి యాక్సిడెంట్ అయినప్పుడు ట్విట్టర్లో స్పందించి ఒక పోస్ట్ ని కూడ షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: