యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాలు నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఇప్పుడు 'దేవర' అనే మూవీలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా థియేటర్ లోకి రాబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో తర్కెక్కుతున్న దేవర చిత్రం సెప్టెంబర్ 27 న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

 ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ గురించి చెప్పుకొచ్చాడు. ఒక స్టూడియోలో అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం పెద్ద వాటర్ ఫుల్ రెడీ చేసామని తెలిపారు. ఇందుకోసం 200 వరకు మ్యాన్ మేడ్ వాటర్ ట్యాంక్స్ రెడీ చేసి.. 35 డేస్ ఆ వాటర్ లోనే షూట్ చేశామని తారక్ వివరించారు. ఈ మూవీలో అదే ముఖ్యమైన సీక్వెల్స్ అని వెల్లడించారు. నిజంగా సముద్రంలో జరిగిన ఫైట్ లా జనాలకు చూపించడానికి చాలా మనీ ఖర్చు చేసామని అన్నారు. అంతేకాకుండా ఎంతగానో కష్టపడ్డామని, కాకపోతే వర్క్ సన్నివేశాలు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చాతాయని తెలిపారు.

 కేవలం 15 నిమిషాల సన్నివేశం కోసం వన్ డే షూట్ చేశామని అన్నారు. వాటర్ లో షూటింగ్ చేసినప్పుడు అప్పుడప్పుడు సరిగ్గా కనిపించకపోయేదని వ్యాఖ్యనించారు. అలాగే ముంబయికు ఫస్ట్ టైమ్ వెళ్లినప్పుడు అక్కడ టెక్నిషియన్స్, ఆర్టిస్ట్స్ ఎలా ఉంటారేమోనని చాలా భయపడిపోయానని తెలిపారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ అప్పుడు దర్శకుడు రాజమౌళి తారక్ ను గైడ్ చేశాడని..దీంతో ముంబయి అంటే కాస్త భయం పోయిందని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. ఇక దేవరా మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇక ఈ మూవీ కోసం ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ అంటే ఎవరైనా వదులుకుంటారా. ఈ మూవీ కోసం పడిగాపులు కాస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: