బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి అనేక విజయాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఓ వైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరో వైపు సినిమాల్లో విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ అనే సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. కానీ ఈ మూవీ లోని ఈయన నటనకు పర్వాలేదు అనే స్థాయిలో రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా , సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ కూడా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఓ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా సైఫ్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా సైఫ్ మాట్లాడుతూ ... ఈ మూవీ అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ సూపర్ గా ఉంటుంది. నాలుగు ఊళ్ళ మధ్య ఈ ఫైట్ కొనసాగిపోతుంది. ఆ యాక్షన్ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుంది అని సైఫ్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: