కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి కేవలం తెలుగు రాష్ట్రాల వారికి మాత్రమే కాదు, ఇపుడు ఇండియా మొత్తం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రీసెంట్ గా ఆయన తమిళ్ మూవీ ‘తిరు’కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఇక తెలుగు, తమిళ్, హిందీ సినిమాలకి కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్న జానీకి మరోవైపు వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. అదేవిధంగా జనసేన పార్టీలో క్రియాశీలక నాయకుడిగా ఆయన ఎటువంటి పాత్రను పోషించారో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో ప్రత్యర్థుల విమర్శలు కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ పై తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో లైంగికంగా వేదించినట్లు పిర్యాదు నమోదైంది.

విషయం ఏమిటంటే... జానీ మాస్టర్ దగ్గర పని చేస్తున్న ఓ మహిళా కొరియోగ్రాఫర్ అతనిపై ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తనపై జానీ మాస్టర్ పలు మార్లు అత్యాచారం చేసాడని ఆమె ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అవుట్ డోర్స్ షూటింగ్స్ కోసం వెళ్ళేటప్పుడు (ముంబై, బెంగుళూరు, చెన్నై) వెళ్లే సమయంలో లైంగికంగా వాడుకున్నాడు అని సదరు మహిళ ఫిర్యాదు చేసినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

కాగా జానీ మాస్టర్ పై ఆరోపనలు చేసిన మహిళ ముంబైలో ఉంటున్నట్లు భోగట్టా. జానీ మాస్టర్ ముంబైలో ఆమె ఇంటికి వెళ్లి కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఈ కేసుని ముంబైకి ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఓ నార్త్ ఇండియన్ కాబట్టి. దాంతో ప్రస్తుతం జానీ మాస్టర్ పై 376తో మరికొన్ని సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జానీ పై అనేక రూమర్స్ వినబడుతున్నాయి. 2017లో జానీ మాస్టర్ పై ఓ కేసు నమోదు కాగా సదరు కేసులో అతనికి ఆరునెలల జైలుశిక్ష కూడా పడిందనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా జనసేన పార్టీతో ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత జానీ మాస్టర్ పై సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్ జరుగుతోందనే విషయం విదితమే. కాగా ఈ ఆరోపణలు ఓ వర్గం వారు కావాలనే సృష్టిస్తున్నారు అనే వాదనలు కూడా వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: