నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నాని రీసెంట్గా సరిపోదా శనివారం మూవీలో హీరోగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నాని సరసన ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఇక వీరిద్దరూ కాంబినేషన్ చాలా చూడముచ్చటగా ఉంది. నాచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుస హిట్స్ అందుకుంటూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. దసరా, హాయ్ నాన్న వంటి సూపర్ హిట్స్ తరువాత ఆయన ఇటీవల నటించిన చిత్రం 'సరిపోదా శనివారం'.

 ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తలకెక్కించగా..డివివి దానయ్య నిర్మించారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ నాని సరసన హీరోయిన్గా నటించగా.. ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించాడు. అయితే సరిపోదా శనివారం ఆగస్టు 29 న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలై ప్రేక్షకులను మెప్పించడంతో పాటు హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాకుండా ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్స్ ఫిసు వద్ద సంచలనం సృష్టిస్తోంది.

తాజాగా, సరిపోదా శనివారం రూ.100 కోట్ల క్లబ్ లో చేరి సత్తా చాటింది. ఈ విషయాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ వెల్లడిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. " ఇప్పుడు సరిపోయింది. మీరంతా ఈ చిత్రాన్ని ఆదరించి... వాక్సాఫీసు వద్ద హాట్ గా నిలిచారు " అని రాసుకువచ్చారు. అంతేకాకుండా సరిపోదా శనివారం రూ.100 వరల్డ్ వైల్డ్ గ్రాస్ సాధించింది. " బాక్సాఫిసు వద్ద శివతాండమే" అనే పవర్ ఫుల్ పోస్టర్ను విడుదల చేశారు. దీంతో అది చూసిన నేచురల్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ కూడా చాలా బాగుంది అని రివ్యూ ఇస్తున్నారు. ఇక నాచురల్ స్టార్ నాని మూవీ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: