పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ఫ్యాన్స్ సినిమాల కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఆయన ఇప్పటికే కమిట్‌ అయిన హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాల వరకు అయినా పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ సినిమాలను ముగించాలని భావించినప్పటికీ సాధ్యం కాలేదు.  తాజాగా సెప్టెంబర్‌ 23 నుంచి వారం లేదా పది రోజుల పాటు 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్‌ లో పవన్‌ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరి హర వీరమల్లు సినిమా ఇప్పుడు రెండు పార్ట్‌ లుగా విభజించబడి, దర్శకుడు ఏఎం జ్యోతి కృష్ణ

 చేతికి వెళ్ళింది. షూటింగ్ చాలా ఆలస్యం అయిన కారణంగా దర్శకుడు క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.  హరిహర వీరమల్లు పార్ట్‌ 1 ను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా నిర్మాత ఏఎం రత్నం ప్లాన్‌ చేస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత రత్నం నిర్మాణంలో పవన్‌ కళ్యాణ్ ఈ సినిమాను చేస్తున్నాడు.  ఇదిలవుండగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు తన తమ్ముడికి ఇష్టమైన ఆహారం గురించి చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.  ఆంధ్ర స్టైల్ లో వండే

 పలావ్ అని పిలవబడే బిర్యాని అంటే పవన్ లొట్టలు వేసుకుంటూ తింటారని నాగబాబు చెప్పుకొచ్చారు. రోజూ తినే ఫుడ్ కంటే పలావ్ ఉన్న రోజు ఆ పలావ్ మరింత ఎక్కువ తింటారని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న సినిమాలపై ప్రస్తుతం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే సినిమా షూటింగ్లో పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఆ వార్తలకు చెక్ పెడుతూ.. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: