యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు యావత్ సినీ లోకమంతా ఆశగా ఎదురుచూస్తున్న సినిమా 'దేవర'. భారీ అంచనాలతో ముస్తాబైన ఈ సినిమా రిలీజ్ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుండగా, దానికి ముందు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఈవెంట్‌కు హాజరై తారక్ మాట్లాడే మూమెంట్ కోసం ఆయన అభిమానులు తహతహలాడుతున్నారు. ఆ సస్పెన్స్కు తెరదించుతూ ప్లేస్, డేట్ ఫిక్స్ చేశారు మూవీ యూనిట్. ఇక ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. తొలి పార్ట్‌లో తారక్ సరసన అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇందులో తారక్

 ద్విపాత్రాభినయం (డ్యూయెల్ రోల్) చేస్తున్నారు. భారీ తారాగణంతో పాటు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాక్కో, టెంపర్ వంశీ, మురళీ శర్మ నటిస్తున్నారు. యువ సుధ ఆర్ట్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాకు సంగీతం అనిరుధ్  అందించారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. దేవర సినిమాలో హీరోగా చేయాల్సింది జూనియర్ ఎన్టీఆర్ కాదట. మరో హీరో చేయాల్సిన సినిమా జూనియర్ ఎన్టీఆర్ చేశారట. ఎన్టీఆర్ చేసిన దేవర సినిమా ముందుగా

 అల్లు అర్జున్ చేతికి వెళ్లినట్టు తెలుస్తోంది.కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుండి అల్లు అర్జున్ తప్పుకున్నారట. అయితే ఇందులో ఉన్న అసలు నిజం ఏమిటంటే..పుష్ప సినిమా విడుదలయ్యాక కొరటాల శివ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఏఏ 21 సినిమా రాబోతుంది అని ఒక ప్రీ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. అయితే ఇదే విషయాన్ని అల్లు అర్జున్ కూడా కన్ఫామ్ చేశారు. దాంతో కొరటాల శివ, బన్నీ కాంబోలో మూవీ రాబోతుందని సంతోషపడ్డారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: