మరాఠీ, హిందీలలో పలు సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈ భామ.. హాయ్ నాన్న సినిమాతో మరొక హిట్ అందుకుని.. నిజంగా మన తెలుగు అమ్మాయేనా అన్నంతగా ఫాన్స్ ను ఏర్పరచుకుంది.  ఇక మృణాల్ ఆఖరిసారిగా ఈ ఏడాది విడుదలైన ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలో చాలా చిన్న పాత్రలో కనిపించింది. అయితే ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చేతిలో.. చాలానే ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి కానీ.. తెలుగు నుంచి మాత్రం ఏమి లేవు. పూజా మేరీ జాన్, హాయ్ జవానీ తో ఇష్క్ హోనా

 హై, సన్ ఆఫ్ సర్దార్ 2 వంటి బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్.. త్వరలోనే టాలీవుడ్ లో కూడా కనిపిస్తే బాగుంటుంది అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  ఈ క్రమంలోనే తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఈ బ్యూటీ తన లవ్, బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. తనకు ఏడు నెలల క్రితమే బ్రేకప్ జరిగిందని.. అయినా పెద్దగా బాధపడట్లేదని తెలిపింది. 'మనకు సరైన వ్యక్తి జీవితంలోకి వచ్చేవరకు చాలా మంది వెళ్లిపోయే వాళ్లు వస్తూ వెళ్తూ ఉంటారు. కానీ మనకు ఎవరు సెట్ అవుతారనేది మనకు మాత్రమే తెలుస్తోంది. నా జీవితంలో ఓ వ్యక్తిని ప్రేమించాను. కానీ అతడితో రిలేషన్ షిప్ నచ్చలేదు. పద్దతిగల

 కుటుంబం నుంచి వచ్చానని.. ఒక నటితో రిలేషన్ షిప్ అంటే ఆలోచించాలి అన్నాడు. దాంతో ఇద్దరం బ్రేకప్ చెప్పుకున్నాం. ఏడు నెలల క్రితం కూడా నాకు బ్రేకప్ జరిగింది. నా జీవితంలోకి వచ్చే వ్యక్తికి లుక్స్ లేకపోయినా పర్వాలేదు. కానీ మంచి మనసు ఉండాలి. ఇప్పటివరకు లైఫ్ లో ఎన్నో బ్రేకప్స్ జరిగాయి. కానీ మరీ అంతగా బాధపడలేదు' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: