టాలీవుడ్ యువ న‌టులు శ్రీ సింహా, క‌మెడియ‌న్ స‌త్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ తాజా చిత్రం ‘మ‌త్తు వ‌ద‌ల‌రా 2. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’ కు సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వ‌హించాడు. జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో న‌టించింది. సెప్టెంబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా చూసిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో పాటు, మెగాస్టార్ చిరంజీవి కూడా మూవీపై ప్ర‌శంస‌లు కురిపించారు.  ఈ సినిమా చూసిన సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు మూవీపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ సంద‌ర్భంగా ఎక్స్

 వేదిక‌గా పోస్ట్ పెట్టాడు. ‘మత్తు వదలరా 2’ సినిమా చూశాను. ఇది ఒక ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్. చాలారోజుల‌కు ఒక సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తూ చూశాను. హీరో శ్రీ సింహతో పాటు మిగతా నటీనటులంతా అద్భుతంగా నటించారు. వెన్నెల కిశోర్ నువ్వు స్క్రీన్ మీద కనిపించినంత సేపు నా కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది. అంటూ తెలిపాడు మహేష్ బాబు. అయితే ఈ సినిమాలో శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా తర్వాత మెయిన్ రోల్ లో నటించిన కమెడియన్ సత్య కంటే ముందు ఈ కామెడీ రోల్ లో మరో నటుడిని తీసుకోవాలి అనుకున్నారట డైరెక్టర్ రితేష్ రానా. ఇక ఆయన మరెవరో కాదు..మాస్టర్ భరత్. ఇక ఈయన ఇప్పటికే డీ దొంగల

 బండి వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  ఒకప్పుడు భరత్ చేసిన కామెడీ చాలా మందిని ఆకట్టుకోవడంతో పెద్దయ్యక కూడా కొన్ని సినిమాల్లో కామెడీ రోల్స్ లో చేసే అవకాశం వచ్చింది.ఇక ఈయనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది రెడీ సినిమా.. అయితే అలాంటి భరత్ ని మత్తు వదలరా టు మూవీలో సత్యపాత్రలో తీసుకోవాలి అనుకున్నారట.  కానీ ఎందుకో అది కుదరలేదు.ఆ పాత్రలో సత్యని తీసుకున్నారు.ఇక మత్తు వదలరా -2 లో సత్య పాత్రకి ఇండస్ట్రీలో ఎంత ఇమేజ్ క్రియేట్ అయిందో చెప్పనక్కర్లేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: