టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ల కోసం అనుసరిస్తున్న పద్ధతులు చూస్తుంటే ఎన్టీఆర్ ఇమేజ్‌ను కావాలని డ్యామేజ్ చేస్తున్నారా అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి. నార్త్‌లో సినిమాపై హైప్‌లేని కారణంగా అక్కడ క్రేజ్‌ ఉన్న సందీప్ రెడ్డి వంగతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేశారా..? అలా అయితే ఎన్టీఆర్‌కు అక్కడున్న క్రేజీ ఏమైంది..? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే కపిల్ శర్మ షో సీజన్ 2 లో కూడా దేవర ప్రమోషన్లు జరిగాయి. ఆ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి షార్ట్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రోమో చూస్తుంటే మరీ దారుణంగా ఎన్టీఆర్‌ని కమెడియన్ చేశారా..? అనిపిస్తుంది.


ఎందుకంటే తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్‌లో సినిమా ప్రమోషన్ల కోసం సెలబ్రిటీలు వస్తే చాలా గౌరవంగా వారిని ట్రీట్ చేస్తారు. కానీ.. కపిల్ శర్మ షోలో అలా జరగలేదు. ఆ విషయం ఆ ప్రోమో చూస్తుంటేనే తెలుస్తుంది. ఇక టాలీవుడ్‌లో కుర్ర హీరోలు సిద్దు, విశ్వక్‌సేన్‌ల‌తో ఎన్టీఆర్.. కొరటాలను ఇంటర్వ్యూ చేయించడం అభిమానులకు సైతం షాక్ ఇచ్చేలా ఉంది. ఇలా యంగ్ హీరోలతో ఇంటర్వ్యూ చూడటానికి కాస్త ఎంటర్టైనింగ్ కనిపించినా.. ఎన్టీఆర్‌కి ఉన్న రేంజ్ ఏంటి..? అసలు దేవర సినిమా రేంజ్ ఏంటి..? వారితో ఇంటర్వ్యూ ఏంటి..? కేవలం యూట్యూబ్ ఛానల్‌కు వ్యూస్ తప్పితే దేవర సినిమాకు ఇది ఏ విధంగా ఉపయోగపడతాయి..? అసలు సినిమాలో విషయం ఉండాలి కదా.. అనే కామెంట్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.


ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ కలిగించే ప్రయత్నంలో కనిపిస్తోందని.. కావాలని ఎన్టీఆర్ రేంజ్‌ను తగ్గించే ప్రయత్నం అని సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ జరుగుతుంది. ఆల్రెడీ ముంబైలో జరిగిన ఈవెంట్లో జై జూనియ‌ర్ ఎన్టీఆర్ నినాదాల‌కు డబ్బులు ఇచ్చి మరీ జనాలను కూడగట్టారని అపవాదులు సోష‌ల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇక తెలుగు మీడియా కంటే నార్త్ మీడియాకే దేవర టీం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం.. తెలుగు మీడియాలో కూడా ఒకరిద్దరు చాలు అన్నట్టుగా వ్యవహరించడంతో దేవరకు సరైన రీతిలో ప్రమోషన్లు జరగటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్‌ని కావాలని దిగజార్చే ప్రయత్నాలు అన్న బాధ అభిమానులలో సైతం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: