పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన యానిమల్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆకట్టుకుంది హీరోయిన్ త్రిప్తి దిమ్రి. ముఖ్యంగా ఈ చిత్రంలో  ఈమె బోల్డ్ నెస్ గా నటించడం అందరిని ఆకట్టుకుంది. కుర్రకారులను మైమరిపించేలా నటించడంతో ఏకంగా ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంది త్రిప్తి దిమ్రి. ఇటీవలే వికీ కౌశల్ తో బ్యాడ్ న్యూస్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.


అలా వరుసగా మూడు సినిమాలలో అవకాశాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. అందులో ఒకటి రాజ్ కుమార్ రావు కి జోడిగా, మరొకటి కార్తీక్ ఆర్యన్ కి జోడిగా, భూల్ బుల్లయ్య -3 లో త్రిప్తి దిమ్రి నటిస్తోందట. ఇవే కాకుండా పలు చిత్రాలలో హీరోయిన్గా కూడ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ముద్దుగుమ్మ ఒక్క చిత్రానికి రూ .5 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్  అందుకుంటున్న హీరోయిన్ల దీపిక మొదటి స్థానంలో ఉన్నది.


ఆ తరువాత ఆలియా భట్, కంగనా రనౌత్ ,అనుష్క శర్మ, కత్రినా కైఫ్ తదితర హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు వీరి స్థానంలోకి త్రిప్తి దిమ్రి చేరిపోయింది. తెలుగులో కూడా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సైతం పోటీపడుతున్నట్లు సమాచారం. పుష్ప-2 చిత్రంలోని స్పెషల్ సాంగ్ కి ఈ ముద్దుగుమ్మను సంప్రదించినట్లుగా వార్తలు అయితే వినిపించాయి. ఈ విషయం పైన అధికారికంగా ఎక్కడ చిత్ర బృందం ప్రకటించలేదు. మరి ఏదైనా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందా లేకపోతే పుష్ప-2 చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నిజంగానే కనిపించి అభిమానులకు షాక్ ఇస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా త్రిప్తి దిమ్రి రేంజ్ మాత్రం పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: