టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో 10 సంవత్సరాల నుంచి.. ఇండస్ట్రీని ఏలిన వారు ఉన్నారు. ఇటీవల ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. అయితే తెలుగు హీరోయిన్ల కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిన హీరోయిన్ల ఎక్కువ. ఇక్కడి దర్శక నిర్మాతలు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఎక్కువగా ఛాన్సులు ఇస్తున్నారు.

 ఈ నేపథ్యంలోనే హీరోయిన్ శ్రియ శరన్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చింది. దాదాపు 15 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది హీరోయిన్ శ్రియ. ఒకప్పుడు స్టార్ హీరోలు అందరి సరసన సినిమాలు చేసి ఇప్పుడు... అసలు సినిమాలలో కనిపించడం లేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాలు చేసి మెరుస్తోంది ఈ బ్యూటీ.

ముఖ్యంగా పెళ్లి అయిన తర్వాత ఈ బ్యూటీ తెలుగులో సినిమాలు చేయడమే కనిపించడం లేదు. పెళ్లి అయినా నేపథ్యంలో హీరోయిన్ శ్రియకు అసలు చాన్స్ లు ఇవ్వడం లేదని ఈ సమాచారం. అయితే అలాంటి హీరోయిన్ శ్రియకు... టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ హీరోకు మధ్య అప్పట్లో ఎఫైర్ ఉందట.  ఆ హీరోతో ఈ బ్యూటీ గతంలో సినిమాలు చేసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య రిలేషన్ పెరిగిందట.

అయితే పెళ్లి చేసుకునే సమయానికి.. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయట. దీంతో ఇద్దరు విడిపోయారు. అటు శ్రియా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయం తాజాగా శ్రియా సన్నిహితుల ద్వారా బయటకు వచ్చింది. కాగా హీరోయిన్ శ్రియ సంతోషం చెన్నకేశవరెడ్డి అలాగే నువ్వే నువ్వే లాంటి వరుస హిట్లు అందుకుని.. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. సీనియర్ హీరోలు అలాగే యంగ్ హీరోలతో కూడా సినిమాలు చేసి పాపులర్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: