గడిచిన నెల నుంచి కోల్కత్తా ట్రైన్ డాక్టర్ అత్యాచార ఘటన ఒక్కసారిగా దేశమంతట ఎంతటి విధ్వంసం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘటన పైన దేశంలోని నలుమూలలో కూడా చాలా నిరసనలు తెలియజేశారు. ఇప్పటికే చాలామంది ఈ ఘటన సైతం ఖండిస్తూ ఉన్నారు.తాజాగా ఒక హీరోయిన్ డాక్టర్ హత్యాచార ఘటన పైన విభిన్నంగా తెలియజేసేలా చేస్తోంది. రోడ్డుపైకి వచ్చి మరి డాన్స్ చేస్తూ ఉన్నది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమికాలలో వైరల్ గా మారుతున్నది.


సాధారణంగా హీరోయిన్స్ అంటే సినిమా ఫంక్షన్స్ లేదా ప్రమోషన్స్ ఏదైనా షాపింగ్ మాల్స్ వంటి వాటికి మాత్రమే బయట కనపడుతూ ఉంటారు. లేకపోతే ఏదైనా ఘటనకు సంబంధించిన ఒక పోస్టుని సైతం షేర్ చేసి చేతులు దులిపేసుకుంటూ ఉంటారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం అలా చేయకుండా ట్రైని డాక్టర్ హత్య ఘటన పైన విభిన్నంగా నిరసిస్తూ తెలియజేసింది. రోడ్డుపైన డాన్స్ చేస్తూ ఉండడమే కాకుండా అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేసిన ఈ హీరోయిన్ అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు.


ఇలా సెలబ్రిటీలు కూడా బయటికి వచ్చి మరి నిరసనలు తెలియజేస్తే కచ్చితంగా ప్రభుత్వాలు త్వరగా స్పందిస్తాయంటూ పలువురు నెటిజెన్స్, అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలా రోడ్డు పైకి వచ్చి డాన్స్ చేసిన హీరోయిన్ ఎవరో కాదు మోక్షసేన్ గుప్తా.. ఈ ముద్దుగుమ్మ బెంగాల్ ప్రాంతానికి చెందిన నటి అయినప్పటికీ తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించింది.. నీతోనే నేను, ఐ హేట్ యు.. తదితర చిత్రాలలో కూడా నటించింది. ధనరాజు, సముద్రఖని  కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న చిత్రంలో కూడా మోక్షసేన్ గుప్తా నటిస్తున్నదట. ఇదే కాకుండా తెలుగులో మరికొన్ని చిత్రాలలో నటిస్తున్న ఈ బెంగాలీ భామ ఇలా రోడ్డుపైన డాన్స్ చేయడంతో చాలామంది ఈమెను మెచ్చుకుంటున్నారు. మరి ఇక మీదైనా కోల్కత్తా డాక్టర్ హత్య కేసులో నిజాలు బయటికి వస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: