తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తున్నారు. కానీ, అందులో కొందరే సక్సెస్ అవుతుండగా.. చాలా మంది అందం, టాలెంట్ ఉన్నా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో పూనమ్ కౌర్ ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. ఆశించిన రీతిలో ఆఫర్లను అందుకోవడం లేదు. కానీ, ఈ మధ్య కాలంలో తనదైన వ్యవహార శైలితో హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా పూనమ్ కౌర్.టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు చేసింది.ప్రస్తుతం మీడియా , సోషల్ మీడియాలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంపై పలువురు సెలెబ్రిటీలు కూడా స్పందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో జానీని మాస్టర్ అని పిలవద్దు.. అలా పిలవాలంటే కనీస గౌరవం ఉండాలంటూ.. చెప్పుకొచ్చింది నటి పూనమ్ కౌర్. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ వివాదం మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది. త్రివిక్రమ్ పై తానూ ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నారా.. అంటూ మా అసోసియేషన్ ను ప్రశ్నిస్తూ పోస్ట్ చేసింది పూనమ్. గతంలో తానూ డైరెక్టర్ త్రివిక్రమ్ పై మా అసోసియేషన్ లో ఉన్న పెద్ద వాళ్లకు కంప్లైంట్ చేసినట్లు.. కనీసం ఇప్పుడైనా ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలంటూ పోస్ట్ చేసింది. తెలుగు శాటిలైట్ ఛానెల్స్ అయిన టీవీ9, ఎన్టీవీ వంటి సంస్థలు కూడా పూనమ్ పోస్ట్ పై కథనాలను ప్రసారం చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అయ్యింది. గతంలో కూడా నటి పూనమ్ కౌర్.. త్రివిక్రమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. త్రివిక్రమ్ ఎలాంటి వారో.. ఆయన స్వభావం ఏంటో తనకు తెలుసనీ, మగవారి ఇగో కోసం ఆయన సపోర్ట్ చేస్తారని.. ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారంటూ పూనమ్ ఫైర్ అయింది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపాయి. పెద్ద పెద్ద మీడియా ఛానెల్స్ కూడా ఈ న్యూస్ ను కవర్ చేశాయి. కానీ కొన్నాళ్ళకు అంతా సైలెంట్ అయిపోయారు. మరి.. పూనమ్ తాజా పోస్ట్ తో అంశాలు తెరపైకి వస్తాయో, ఎలాంటి వారిని కదిలిస్తుందో.. కనీసం ఇప్పుడైనా పూనమ్ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూనమ్ త్రివిక్రమ్ పై చేసిన పోస్ట్ కూడా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: