తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ పై ప్రతి సీజన్లోని ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ షో కారణంగా సమాజానికి హాని తప్ప ఎక్కడ మేలు జరగడంలేదని.. ఈ షోని వెంటనే బ్యాన్ చేయాలి అంటూ ఇప్పటివరకు ఎంతోమంది సోషల్ మీడియాలో డిమాండ్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. బిగ్ బాస్ లాంటి షో చూసి ఎంతోమంది పిల్లలు చెడిపోతున్నారని.. ఇంకొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉంటారు.


 అయితే ఇలా ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ బిగ్ బాస్ మాత్రం టాప్ రేటింగ్స్ అందం చేసుకుంటూ దూసుకుపోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఎనిమిదో సీజన్ ఉత్కంఠ భరితంగా  సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక హౌస్ లో ఎప్పటిలాగానే నామినేషన్స్ ఎలిమినేషన్స్  రచ్చ రచ్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇటీవల జరిగిన ఒక ఘటన బయట ఉన్న ప్రేక్షకులకు అస్సలు నచ్చడం లేదు. హౌస్ లో మొన్నటి వరకు స్నేహితులుగా కొనసాగిన యష్మి, మణికంఠ మధ్య ఇటీవలే నామినేషన్ సమయంలో పెద్ద గొడువే జరిగింది.


 అయితే నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత యష్మీ దగ్గరికి వెళ్లిన మణికంఠ వెనుక నుంచి హాగ్ చేసుకుని అదంతా నామినేషన్స్ వరకే.. ఎక్కువగా ఆలోచించకు అని చెబుతాడు  దీంతో యశ్మీ సరే వదిలేయ్ అని చెబుతుంది. అయితే మణికంఠ వెళ్ళిపోయాక నావల్ల కావట్లేదు బిగ్ బాస్. నాకు కోపం వస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది  ఆ తర్వాత పృథ్వి దగ్గరికి వెళ్లి నాకు మెంటల్ టార్చర్ లాగా ఉంది. వచ్చి హాగ్ చేయడం నాకు అస్సలు కంఫర్టబుల్గా ఉండదు. ఆల్రెడీ అతనికి చెప్పిన వినట్లేదు. అతను పూర్తిగా ఫేక్. నేను ఇక్కడ హౌస్ లో ఉన్నంతకాలం అతన్ని నామినేట్ చేస్తూనే ఉంటాను అంటూ చెప్పిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. దీంతో బిగ్ బాస్ హౌస్ లో కూడా మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని.. కొంతమంది నేటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి.

మరింత సమాచారం తెలుసుకోండి: