* కోలీవుడ్ ప్లే బాయ్ గా పేరున్న శింబు..!

* 'వల్లభ' తో మొదలైన ప్రేమాయణం.!

* సోషల్ మీడియాలో రచ్చ చేసిన వారి సన్నిహిత ఫోటోలు.!

* బై.. బై.. అంటూ ఎఫైర్ కు ఎండ్ కార్డ్.!

లేడీ సూపర్ స్టార్ నయనతార పదిహేనేళ్ల కెరీర్‌లో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో నటించింది.లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో, హీరోలకు ధీటుగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది.గ్లామర్,ట్రెడిషన్..ఏ లుక్కులో కనిపించినా,కమర్షియల్, మెసేజ్ ఓరియంటెడ్ ఏ జానర్ సినిమా చేసినా తన స్టైలే వేరు.ఇదంతా తెరముందే తెరవెనుక నయనతార జీవితంలో ఒడిదుడుకుల గురించి అందరికీ తెలిసిందే.మొదట్లో శింబుతో ఆ తర్వాత ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారాలు ఒకటికి రెండు సార్లు బెడిసి కొట్టడం ఆమె జీవితంలో ఊహించని మార్పులు తీసుకొచ్చాయి.తమిళ నటుడు శింబుతో నయనతార అనుబంధం ప్రజల దృష్టిని ఆకర్షించిన మొదటి వాటిలో ఒకటి.వాళ్లు కెరీర్ ప్రారంభంలోనే డేటింగ్ చేశారు.కానీ వారి సంబంధం కొన్ని నెలలు మాత్రమే కొనసాగింది.గాఢమైన ముద్దును పంచుకుంటున్న వారి సన్నిహిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే వారి ఎడబాటుకు కారణం అయ్యింది.

అసలు వారి ప్రేమ విషయానికి వస్తే తమిళ్ లో 'వల్లవన్' సినిమా చిత్రీకరణలో శింబు నయనతారల మధ్య ప్రేమ మొదటిసారిగా ప్రేమ చిగురించింది.ఆ సినిమాలో కలిసి నటించడం ప్రారంభించిన వారిద్దరూ పబ్లిక్ ప్రదేశాలలో చట్టపట్టలేసుకుని తిరిగి అభిమానుల కంట ఎన్నోసార్లు పడ్డారు. ఆ మూవీలో 'వల్లభా నా వల్లభా కొంచెం మెల్లగా ఎద గిల్లవా' అనే శృంగారభరితమైన పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ సాంగ్ అప్పట్లో యూత్ను ఒక మోత మోగించింది అనడంలో ఆశ్చర్యం లేదు.అయితే సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ పెట్టుకోవడం, బ్రేక్ అప్స్ చెప్పుకోవడం అనేది సర్వసాధారణ మన్న సంగతి తెల్సిందే.అయితే వారి విషయంలో కూడా అదే జరిగింది వాళ్ళిద్దరు ఏకాంతంగా కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.


వారిద్దరి లిప్ టు లిప్ కిస్ ఇస్తున్న ఫోటో అప్పట్లో తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో పెద్ద దుమారమే రేపింది.ఈ ఫోటో లీక్ అవ్వడమే వారు విడిపోడానికి కారణం అయ్యిందని అప్పట్లో పెద్ద టాక్.అయితే ఆ ఫోటోలు కావాలనే శింబు సోషల్ మీడియాలో పెట్టడానికి నయన్ భావించడంతో వారు విడిపోయారు.అయితే మరికొందరికి ప్రకారం వారి  బ్రేకప్ కు కారణం ఫోటో కాదని డైరెక్ట్గా శింబు ఒకానొక హోటల్ లో వేరే అమ్మాయితో ఉండడం అనేది నయన్ చూసి అతన్ని ఛీ కొట్టి వెళ్లిందని మరికొందరంటున్నారు.అలా శింబు చేసిన మోసాన్ని భరించలేని నయనతార రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అదృష్టవశాత్తు ఆమె బతికి బట్టకట్టింది.అయితే లీకైన ఫోటోల గూర్చి ఒకనొక సందర్భంలో అవి దుబాయిలో తీసినవని అవి లీకైన సమయంలో తనకి నయనతార కు బాగా గొడవలు అవుతున్నాయని తెలిపాడు.ఈ వివాదం వలన పెళ్లి వరకు వచ్చిన వ్యవహారం అంతటితోనే ఆగిపోయింది.ఈ వివాదం తరువాత శింబు కెరీర్ లో కూడా బాగా జోరు తగ్గింది.ఆ తర్వాత నయనతార ప్రభుదేవాతో కొంతకాలం ఎఫైర్ నడిపి చివరికి డైరెక్టర్ విగ్నేష్ ను వివాహం చేసుకొని హ్యాపీగా కుటుంబం గడుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: