ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరెట్ టీవీ షో బిగ్‍‌ బాస్ తెలుగు సీజన్ 8 మూడో వారంలోకి అడుగు పెట్టింది. గత బిగ్‍‌ బాస్ సీజన్లతో పోల్చుకుంటే ఈసారి మరీ పేరున్న కంటెస్టెంట్స్ హౌస్ లో లేరు కానీ.. కొందరు మాత్రం ఆడియెన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. రెండో వారం ప్రేక్షకుల అందరికి పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. బిగ్‍‌ బాస్ హౌస్ లో అంతో ఇంతో ఫన్ తెపిస్తున్న శేఖర్ బాషాను బయటకు పంపించి ఆడియెన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే, రాబోయే వారాలలో కూడా ఇలాంటి పరిణామాలే చాలా ఉండబోతునట్టు తెలుస్తోంది.

తాజాగా మూడో వారం నామినేషన్ల ప్రక్రియ కూడా చాలా హోరాహోరీగా సాగింది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఒకరిపై ఒకరు అరిచేసుకుంటూ తమకు నచ్చని వారిని నామినేట్ చేయడం మనం చూడవచ్చు. అయితే ప్రస్తుతం బిగ్‍‌ బాస్ హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉంటే మూడో వారం ఎనిమిది మంది నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. అయితే గత వారం కూడా  నామినేషన్స్ లిస్ట్ లో ఎనిమిది మందే నామినేట్ అవ్వడం గమనార్హం. అయితే మూడో వారం నామినేట్ అయిన వారిలో నాగమణికంఠ, యష్మీ , కిర్రాక్ సీత, నైనిక, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, అభయ్ నవీన్ ఉన్నారు. అయితే టీమ్ లీడర్స్‌ని ఎవరూ నామినేట్ చేయొద్దని చెప్పిన బిగ్‌బాస్.. వీళ్లలో ఒకరు నామినేషన్స్‌లో ఉండాలని తెలియచేశాడు.

నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మూడవ వారంలో ప్రముఖ నటుడు అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యిన సంగతి అందరికి తెలిసిందే.  ఈ క్రమంలో అభయ్ నవీన్ తన గురించి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామన్న ఆసక్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు  తెలిపారు. ఆ నిర్ణయమే ఇప్పుడు నవీన్ పాలిట యమగండంలా మారనుందని అర్థం అవుతుంది. అందుకు గల కారణం.. ఓటింగ్ ప్రక్రియ ఎవరికీ అంచనా కూడా రావడం లేదు. ప్రతి వారంలో లాగానే విష్ణుప్రియ టాప్‌ ప్లేస్ లో ఉంది. అనంతరం  వరసగా మణికంఠ, సీత, యష్మీ గౌడ, నైనిక, అభయ్ నవీన్, పృథ్వీరాజ్ ఉన్నారు. ప్రస్తుత  ఓటింగ్ ప్రకారం అభయ్ నవీన్, పృథ్వీరాజ్ డేంజర్ జోన్ లో ఉన్నటు తెలుస్తుంది. అయితే  గడిచిన వారం లాగే ఈ వారంలో  కూడా పృథ్వీని బిగ్ బాస్ సేవ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీంతో ప్రస్తుతం అభయ్ నవీన్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఓటింగ్ ప్రక్రియ ఇలాగే కొనసాగితే మాత్రం అభయ్ నవీన్ హౌస్ నుంచి బయటకు వెళ్లక తప్పదు. చూడాలి మరి చివరికి ఏమి అవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: