మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇక ఆ ఫ్యామిలీ నుంచి డజను మంది హీరోలు ఉన్నప్పటికీ చిరంజీవి సినిమాలు ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద కోట్ల రూపాయల వసూళ్లు కురిపిస్తాయి. ఇక వయసు పెరిగినా ఆయనలో గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆయన డ్యాన్స్ చూస్తే ప్రేక్షకులు థియేటర్లలో ఈలలు వేస్తారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ఇక కెరీర్ పరంగా చూస్తే మెగాస్టార్ చిరంజీవి-హీరోయిన్ సుహాసిని జంటగా ఎన్నో సినిమాల్లో నటించారు.

 వీరి జంటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వెండితెరపై ఎన్నో మరుపురాని సినిమాలు తీశారు. వీరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. ఇక చిరంజీవి తనను ఓ విషయంలో కాపాడారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుహాసిని తెలిపారు. ఆయన నిజ జీవితంలోనూ మెగాస్టార్ అని ఆమె అభినందించారు. మెగాస్టార్ రియల్ హీరో అని, వెంటనే స్పందించి అపాయంలో ఉన్న తనను కాపాడారని ఓ సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం.

తెలుగులో చిరంజీవి, సుహాసిని జంటగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. మగమహారాజు సినిమాలో తొలిసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత ఛాలెంజ్‌, చంటబ్బాయ్‌, రాక్షసుడు, మంచిదొంగ, ఆరాధన వంటి సూపర్ హిట్ సినిమాలో వీరి కలయికలో వచ్చాయి. ఇక ఓ సినిమా షూటింగ్ కోసం వీరు కేరళకు వెళ్లారు. ఆ సమయంలో ముందు కారులో చిరంజీవి వెళ్తున్నారు. వెనుక కారులో సుహాసిని, డ్యాన్స్ మాస్టర్, హెయిర్ డ్రెస్సర్ ఇతర సిబ్బంది ఉన్నారు. ఇక సుహాసిని ఉన్న కారును కొందరు తాగుబోతులు అడ్డగించారు.


అంతేకాకుండా వారిపై దాడికి యత్నించారు. మందు బాటిళ్లతో వారి కారుపై దాడి చేశారు. దీనిని ముందు కారులో వెళ్తున్న చిరంజీవి గమనించారు. వెంటనే కారు దిగి సుహాసిని వద్దకు వెళ్లారు. తన వద్ద ఉన్న తుపాకీతో ఆ దుండగులను బెదిరించారు. దీంతో వారు పారిపోయారు. ఇలా తనను చిరంజీవి ఆ రోజు కాపాడారని సుహాసిని గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో వైపు చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సోషియో ఫాంటసీ సినిమా వచ్చే ఏడాది సంకాంత్రికి విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: