అలనాటి నటి మంజు వారియర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ బ్యూటీ సినీ నటిగా, డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా మంజు మలయాళం సినిమాల్లోనే నటించింది. 1995 సంవత్సరంలో సాక్ష్యం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. కేవలం 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినీ ఇండస్ట్రీలో హీరోలు 30, 40 ఏళ్లు అయినా కూడా హీరోలుగా కొనసాగుతారు. కానీ హీరోయిన్లు మాత్రం పదేళ్లకు మించి కొనసాగడం గొప్ప విషయంగా మారిపోతుంది.


అతి కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే పదేళ్లకు మించి హీరోయిన్లుగా రాణిస్తారు. అలాంటి పరిస్థితుల్లో మంజు వారియర్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ బిజీ బిజీగా ఉంటుంది. మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ తమిళ సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తుంది. అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా రాణించడం జరిగింది ఈ మంజు. ఈ మధ్యకాలంలో మంజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. ధనుష్ తో కలిసి ఈమె చేసిన సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది. హీరోయిన్గా ఇప్పటికీ తన సత్తా చాటుతున్న మంజుకు మరిన్ని సినిమా ఆఫర్లు వస్తున్నాయి.


ఇటీవలే రజనీకాంత్ తో కలిసి వెట్టయన్ సినిమాలో నటించింది మంజు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా దసరా కానుకకు అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు మంజు వారియర్ స్టెప్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా.... ఈ సినిమాలో తన పాత్ర గురించి మంజు తాజాగా చెప్పుకొచ్చింది.


ఈ సినిమాలో వచ్చిన అవకాశంపై ఆమె స్పందించారు. వెట్టయన్ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ భార్యగా నేను నటించానని తెలిపారు మంజు. నా పాత్ర పేరు తారా. రజినీకాంత్ వివిధ రకాలైన స్టైల్స్ ఇప్పుడు చూస్తున్నానని వివరించారు. ఈ చిత్రంలో అవకాశం రావడం, రజిని సరసన నటించడం ఎంతో ఆనందంగా ఉందంటూ పేర్కొంది మంజు. ఈ సినిమాలోని మాసిలాయో పాటకు అనేకమంది సినీ కళాకారులతో కలిసి డ్యాన్స్ చేసిన అనుభవం ఎన్నటికీ నేను మరచిపోలేనని వివరించార మంజు. ఇతర భాషల్లో కంటే తమిళంలో మంచి పాత్రలు నాకు వస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం మంజు వారియర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: