పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కోలీవుడ్ లో స్టార్ డమ్ కోసం సిన్సియర్ గా ప్రయత్నిస్తోంది. అదితి ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన హీరోయిన్ గా ఓ కొత్త తెలుగు సినిమాకోసం అదితిని నిర్మాతలు సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ మూవీతో ఆమె టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారు. అయితే ఆ సినిమా కంటే ముందే ఆమె టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం కాబోతున్నారని సమాచారం. తాజా షెడ్యూల్ లో అతిధి శంకర్సినిమా సెట్స్ లో అడుగుపెట్టింది. టాలీవుడ్ కు పరిచయం కానున్ననేపథ్యంలో చిత్ర

 యూనిట్ అతిధి శంకర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. అల్లరి నరేష్ తో నాంది, ఉగ్రం చిత్రాలు తెరకెక్కించిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ భారీ ముల్టీస్టారర్ రూపుదిద్దుకుంటుంది. తమిళంలో సూరి నటించిన సూపర్ హిట్ చిత్రం గరుడన్ రీమేక్ గా ఈ సీనియా రానుంది. శంకర్ డైరక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ లో అదితి ఓ గెస్ట్ రోల్ చేశారని టాక్.  దర్శకుల వారసులు ఇండస్ట్రీలో సకెస్స్ అయిన సందర్భాలు అతి కొద్దిగా మాత్రమే ఉన్నాయి. స్టార్ హీరోయిన్ గా తనని తాను నిరూపించుకోడానికి అదితి కూడా సిన్సియర్ గా ట్రై చేస్తున్నారు. అయితే డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితికి డైరక్షన్ ఫీల్డ్ పై ఇంట్రస్ట్

 ఏమాత్రం లేదు. ఆమె హీరోయిన్ గా కోలీవుడ్ లో ఆఫర్లు పట్టేశారు. హీరో కార్తి నటించిన 'విరుమన్' ద్వారా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.  దర్శకుడు శంకర్ కుమార్తెలలో ఒకరైన అతిధి శంకర్ తమిళ చిత్ర పరిశ్రమలో కార్తీ నటించిన వీరుమాన్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. ఆ తర్వాత శివ కార్తికేయన్ సరసన మావీరన్ సూపర్ హిట్ తో అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం అర్జున్ దాస్ కు జోడిగా నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న యూత్ ఫుల్ కాలేజ్ లవ్ నేపథ్యంలో రానున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: