పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడంతో ఆయనకి ఇండస్ట్రీలో గౌరవ మర్యాదలు మరింత ఎక్కువ అయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ ని ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు వేలెత్తి చూపే సమస్య ఏదీ లేదు. కానీ ఆయన మూడు పెళ్లిళ్ల విషయం ఒక్కటే ఆయన కి కాస్త మైనస్ అని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా జానీ మాస్టర్ వివాదం వెలుగులోకి రావడంతో మరో హీరోయిన్ కూడా ఇండస్ట్రీ లో రచ్చ చేస్తుంది. ఆమె ఎవరో కాదు పూనమ్ కౌర్.. చాలా సంవత్సరాల నుండి పూనమ్ కౌర్  త్రివిక్రమ్ ని, పవన్ కళ్యాణ్ ని వేలెత్తి చూపుతూ సోషల్ మీడియాని ప్లాట్ఫామ్ గా మార్చుకొని వారిపై నెగటివ్ కామెంట్లు పెడుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా జానీ మాస్టర్ వివాదం బయటపడ్డాక త్రివిక్రమ్ గురించి సంచలన పోస్ట్ పెట్టింది. అయితే ఈమె పెట్టిన పోస్ట్ కి తమ్మారెడ్డి భరద్వాజ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వండి మేము చూసుకుంటాం అని చెప్పారు. 

ఇదంతా పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ కి నందిని, రేణుదేశాయ్ తర్వాత మూడో భార్యగా అన్నా లెజ్నోవా వచ్చింది. అయితే అన్నా లెజ్నోవా కంటే ముందే పవన్ కళ్యాణ్ కి మూడో భార్యగా ఆ హీరోయిన్ రావాల్సిందట. ఆమె ఎవరో కాదు పూనమ్ కౌర్.. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. జల్సా సినిమా సమయంలో త్రివిక్రమ్, పూనమ్ మధ్య వివాదం తలెత్తింది. ఎందుకంటే పార్వతి మెల్టన్ నటించిన పాత్రలో ముందుగా పూనమ్ కౌర్ ని తీసుకున్నారట. కానీ ఆ తర్వాత పూనమ్ ని తీసేసి పార్వతి మెల్టన్ ని పెట్టుకున్నారు.

 అయితే అప్పటికే పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ రిలేషన్ లో ఉన్నారట.ఇక విషయం బయటపడడంతో  పవన్ కి ఎంతో సన్నిహితుడు అయినటువంటి త్రివిక్రమ్ వీరిద్దరి మధ్య రిలేషన్ చెడగొట్టారట. ఆ తర్వాత పవన్ పూనమ్ కౌర్ నుండి  విడిపోయారు. అలా త్రివిక్రమ్ కల్పించుకోకపోతే పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ మధ్య రిలేషన్ అలాగే ఉండేదట. ఒకవేళ అదే నిజమైతే కచ్చితంగా వీరిద్దరూ మూడో పెళ్లి చేసుకునే వారని ఈ విషయం తెల్సిన కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పూనమ్ కౌర్ పెట్టే మంటలో పవన్ త్రివిక్రమ్ బలవుతారా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: