ఈమధ్య విడుదలైన చిత్రాలలో ఎక్కువగా చర్చించుకుంటున్న చిత్రం ఇండియన్ -2 ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ మొత్తం గేమ్ ఛేంజర్ మీద పెట్టారు డైరెక్టర్ శంకర్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా పైన కూడా అభిమానులకు భారీ ఎక్స్పెక్టేషన్ నెలకొనేలా చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ పైన కూడా రోజుకొక రూమర్ వినిపిస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి వేస్టేజ్ జరిగిందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.



గత కొంతకాలంగా ప్లాపులతో సతమతమవుతున్న డైరెక్టర్ శంకర్ భారతీయుడు-2 చిత్రంతో ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. ఇలాంటి సమయంలో గేమ్ ఛేంజర్ సినిమా మీద అందరి దృష్టి పడడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ అవుతుందని  చరణ్ అభిమానులు భావిస్తూ ఉండగా.. తమన్సినిమా గురించి అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఈ ఏడాది డిసెంబర్ 20న విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. శంకర్ డిఫరెంట్ కథా అంశంతో  ఈ సినిమాని తెరకెక్కించారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ తనదైన స్టైల్  ఆకట్టుకునేలా ఉండబోతున్నారని ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఇంటర్వెల్ సన్నివేశం కోసం ఏకంగా రూ .4కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ రూ .350 కోట్లకు పైగా మారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వేస్టేజే సుమారుగా 80 నుంచి 100 కోట్ల వరకు  సన్నివేశాలు చిత్రీకరించినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజ్ 50వ చిత్రం కాబట్టి ఈ సినిమాకి ఎంతైనా బడ్జెట్ పెడుతున్నారు. మరి రూ .100 కోట్ల రూపాయల వేస్టేజ్ అంటే అది నమ్మేలా లేదని అభిమానులు భావిస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: