గడచిన మూడు రోజులుగా జానీ మాస్టర్... కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఎక్కడ నలుగురు గుమ్మిగూడిన సరే జానీ మాస్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. తన వద్దకు డాన్స్  కోసం వచ్చిన ఓ యువతిని ట్రాప్ చేసిన జానీ మాస్టర్.. తన పడక సుఖానికి వాడుకున్నాడు. మైనర్ గా ఉన్నటువంటి ఆ బాలిక.. యుక్త వయసు వచ్చేవరకు అంటే దాదాపు 9 సంవత్సరాలుగా ఆ బాలికను... జానీ మాస్టర్ వాడుకుంటున్నాడట.


ముంబై అలాగే గోవా లాంటి ప్రాంతాలకు తీసుకువెళ్లి.. లైంగిక దాడి కూడా చేశాడట. అయితే ఇలాంటి జానీ మాస్టర్ పైన.. చాలా మంది సెలబ్రిటీలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తప్పు చేసిన జానీ మాస్టర్ను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో... జానీ మాస్టర్ ను తిట్టాల్సింది పోయి మెగా బ్రదర్,  జనసేన పార్టీ నాయకులు నాగబాబు చాలా వింతగా స్పందించారు.


జానీ మాస్టర్ కు పరోక్షంగా మద్దతు తెలుపుతూ నాగబాబు పోస్ట్ పెట్టారు. నిందితుడు అని ఇప్పుడే.. అందరూ అనుకోవద్దు. తప్పు చేసిన వాడు.. కోర్టు నుంచి తప్పించుకోలేడు. తప్పు చేశాడని.. కోర్టు చెప్పేవరకు అతన్ని నిందితుడు అని మనం అనుకోవద్దు... అంటూ పరోక్షంగా జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్ గా నిలిచారు.


అయితే నాగబాబు ట్వీట్ చూసిన.. నేటిజన్స్ మండిపడుతున్నారు. పరోక్షంగా జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్ గా నిలుస్తున్నాడని ఆగ్రహిస్తున్నారు. అలాంటి నీచున్ని జనసేన పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు అని నాగబాబును నిలదీస్తున్నారు. జనసేన పార్టీలో ఉన్న నేతలు అందరూ ఇలాగే తయారయ్యారని.. ఫైర్ అవుతున్నారు. నాగబాబు చేసిన పోస్ట్ వెనుక మర్మం ఏంటని... సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. అయితే.. మెగా బ్రదర్,  జనసేన పార్టీ నాయకులు నాగబాబు చేసిన ఈ పోస్ట్‌ పై విమర్శలు వస్తున్న తరుణంలో..ఆయన ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: