మాజీ ప్రపంచ సుందరి ఐశ్వ‌ర్య - అభిషేక్ బచ్చన్ దంపతుల గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. యావత్ బాలీవుడ్లోనే అందమైన జంటగా పేరు తెచ్చుకున్న ఈ జంట, ఈ మధ్యకాలంలో అయితే వరుసగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. విషయం ఏమిటంటే... ఈ దంపతులు విడాకులు తీసుకుంటున్నారు అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఇటువంటి వార్తలకు వీరు చాలా సార్లు చెక్ పెట్టగా పదేపదే వారి విడాకుల గురించే మీడియా మాట్లాడడంతో బిగ్ బి అమితాబ్ ఈ వ్యాఖ్యల పట్ల అసహన వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక అమితాబ్ బచ్చెన్ కి కొడుకు అభిషేక్ ఎలాగో, కోడలు ఐశ్వర్య అన్నా అంతే అభిమానం అని చెప్పుకోవాలి. ఇక ఆ అభిమానానికి తార్కాణంగా ఓ విషయాన్ని బిగ్ బి ఇటీవల ఓ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. విషయం ఏమిటంటే... అక్షయ కుమార్, ఐశ్వర్య రాయ్ కలిసి నటించిన ‘ఖాకీ’ చిత్రీకరణ సమయంలో ఐశ్వర్య రాయ్ కి జరిగిన ప్రమాదం గురించి గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. “2023 నాసిక్‌లో ‘ఖాకీ’ షూటింగ్‌లో జరిగిన ఆ ప్రమాదాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. షూట్లో స్టంట్‌మ్యాన్ కారుతో స్టెంట్ చేస్తుండగా అదుపు తప్పి, ఐశ్వర్య కూర్చున్న కుర్చీ పైకి దూసు కెళ్లింది. ఈ ప్రమాదంలో ఐశ్వర్య తీవ్రంగా గాయపడింది. దాంతో ఐశ్వర్యను ముంబై తీసుకెళ్లడానికి అనిల్ అంబానీ ప్రైవేట్‌ విమానం ఏర్పాటు చేశాము.


కానీ నాసిక్‌లో నైట్ ల్యాండింగ్ సౌకర్యం లేకపోవడంతో.. ఆసుపత్రికి 45 నిమిషాల దూరంలో ఉన్న సైనిక స్థావరంలో విమానాన్ని ల్యాండ్ చేయవలసి వచ్చింది. దాని కోసం ఢిల్లీ నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. అయితే అప్పుడు ఆ ఘటనని అందరూ చాలా చిన్న సంఘటనగా కొట్టివేశారు. కానీ ఆమెకు తగిలిన గాయాలు చూసి నేను ఎంతో కలత చెందాను. రెండు రోజులు అయితే నిద్ర పట్టలేదు. ఆమె వీపు భాగంలో, కాళ్ళకు తీవ్ర గాయాలు అయ్యాయి. పాదం ఎముక అయితే పూర్తిగా విరిగిపోయింది. నా కళ్ళ ముందే జరిగిన ఈ సంఘటన మర్చిపోవడానికి చాలా రోజులే పట్టింది!" అని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. కాగా ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్‌ను ఏప్రిల్ 20, 2007న వివాహం చేసుకోగా వీరిద్దరికీ ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె పుట్టింది. ప్రస్తుతం వారు చక్కగా జీవిస్తున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: