ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారంటాలీవుడ్ మీడియాలో రచ్చ సృష్టిస్తోంది. రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే దాదాపు 6 సంవత్సరాలు జానీ మాస్టర్ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ ఆయనపై లైంగిక వేధింపులు, అత్యాచారం కింద కేసు పెట్టడంతో ఈయన బాగోతం కాస్త బయటపడింది. ఇక జానీ మాస్టర్ పై చాలా మంది మండిపడుతూ ఆయన్ని సినిమా ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయాలి అంటూ తిట్టిపోస్తున్నారు. ఇక ఈ ఫిర్యాదులో జానీ మాస్టర్ భార్య పేరు కూడా జోడించింది.జానీ మాస్టర్ భార్య కూడా తనని మతం మార్చుకొని తన భర్తకి రెండో భార్యగా రావాలి అని హింసిచ్చిందని చెప్పింది.దీంతో జానీ మాస్టర్ భార్యపై కూడా కేసు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే తాజాగా బెంగళూరులో జానీ మాస్టర్ హైదరాబాద్ SOT పోలీసులకు పట్టుబడ్డ సంగతి మనకు తెలిసిందే. 

ఇప్పటికే బెంగళూరు నుండి హైదరాబాద్ కి SOT పోలీసులు ఆయన్ని తరలిస్తున్నారు. ఇక ఇలాంటి వేళ తాజాగా నార్సింగి పోలీస్ స్టేషన్ కి జానీ మాస్టర్ భార్య సుమలత రావడం చర్చనీయాంశంగా మారి మీడియాలో ఈ విషయం వైరల్ గా మారుతుంది.అయితే సుమలత అక్కడికి ఎందుకు వచ్చిందంటే..జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా కి ఎవరో ఫోన్ చేసి మీ భర్త నార్సింగి పోలీస్ స్టేషన్లో ఉన్నారని ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారట.దాంతో హుటాహుటిన నార్సింగి పోలీస్ స్టేషన్ కి వచ్చి మళ్లీ కారెక్కి వెళ్లిపోయింది సుమలత.. 

అయితే తన భర్త బెంగళూరులో ఉన్నారని సుమలత అలియాస్ ఆయేషా చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఆయన్ని ఇవాళ లేదా రేపు కోర్టు లో హాజరు పరిచే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే ఆ లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదులో జానీ మాస్టర్ భార్య పేరు కూడా ఉండడంతో ఆమెను కూడా నేరస్తురాలుగా జమ కట్టి శిక్ష వేస్తారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: