హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు చేతినిండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఒక్క సౌత్ సినిమాలో కూడా అవకాశం లేకపోవడం ఆమె అభిమానులకు కాస్త బాధాకరం అని చెప్పవచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చేయకపోయినప్పటికీ ఆమెకి ఉన్న తెలుగు అభిమానులు మాత్రం ఎప్పటికీ రకుల్ ని ఆరాధిస్తూనే ఉంటారు. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన ఒక సంచలన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఆ మాజీ మంత్రి, ఎమ్మెల్యే రకుల్ ని వాడుకొని వదిలేసాడు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన వీడియో నెట్టింట దుమారం సృష్టిస్తోంది. మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ఫోన్ టాపింగ్ ఇష్యూ ఎంత పెద్ద దుమారం సృష్టించిందో చెప్పనక్కర్లేదు. 

ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో రాజకీయ నాయకుల తో పాటు హీరోయిన్లు కూడా బలయ్యారు. అలా సమంత, రకుల్ ప్రీత్ సింగ్ వంటి పేర్లు బయటపడ్డాయి. అయితే ప్రతిసారి కాంగ్రెస్ వాళ్ళు రకుల్ ప్రీత్ సింగ్,సమంత ఇష్యూ ని బయటికి తెస్తూ ఉంటారు అంతేకాదు రకుల్ ని కేటీఆర్ తో ముడిపెడుతూ ఎన్నో రూమర్లు వైరల్ చేస్తున్నారు కొంతమంది కాంగ్రెస్ బిజెపి కి సంబంధించిన యూట్యూబర్లు. అయితే తాజాగా అలాంటిదే ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు  రకుల్ ప్రీత్ సింగ్, కేటీఆర్, జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించిన ఫోటోలు పెట్టి కేటీఆర్ నా జీవితం నాశనం చేశాడు అని రకుల్ అన్నట్లు థంబ్ నెయిల్  పెట్టారు.

 ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది కేటీఆర్,రకుల్ ప్రీత్ సింగ్ ఆ అభిమానులు ఆ యూట్యూబ్ ఛానల్ వారిపై ఫైర్ అవుతున్నారు. వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారుతారా అంటూ మండిపడుతున్నారు. అలాగే ఇదంతా కాంగ్రెస్, బిజెపి వాళ్లు చేసిన కుట్ర అని,వాళ్లే ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ ఇలాంటి ఫేక్ న్యూస్ లు క్రియేట్ చేస్తున్నారని,అలాగే దీని వెనుక ఉన్నది ఎవరో కూడా బయట పెడదామని బీఆర్ఎస్ వాళ్లు చెప్పుకొస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: