యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 సినిమాలో హీరోగా నటించాడు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. జాన్వి కపూర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల అయ్యి కొంత కాలం ముగిసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ "దేవర పార్ట్ 2" సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఇక దేవర సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయం లోనే ఎన్టీఆర్ హిందీ సినిమా వార్ 2 లో హీరో గా నటిస్తూ వచ్చాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది.

దేవర మొదటి భాగం విడుదల అయిన తర్వాత వార్ 2 సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే వీరి కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నారు. ఈ మూవీ కోసం అత్యంత భారీ బడ్జెట్ ను ఈ సంస్థ వారు కేటాయించినట్లు తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కి ఏకంగా 600 కోట్ల బడ్జెట్ ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ బ్లాక్ బస్టర్ అందుకొని ఆ తర్వాత దేవర 2  , వార్ 2 మూవీ లు కూడా మంచి విజయాలను సాధించినట్లయితే ఎన్టీఆర్ , ప్రశాంత్ కాంబో మూవీ కి 600 కోట్ల బడ్జెట్ పెద్ద విషయం ఏమీ కాదు. ఈజీగా ఆ కలెక్షన్లను ఎన్టీఆర్ , ప్రశాంత్ కాంబో మూవీ రాబట్టే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: