తెలుగు బుల్లితెర ప్రేక్షకులు అందరినీ కూడా టీవీలకు అతుక్కుపోయేలా చేస్తూ.. టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది బిగ్ బాస్ షో. ఇక ఇప్పటికే 7 సీజన్స్ సక్సెస్ అవ్వగా ఇప్పుడు ఎనిమిదవ సీజన్ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటిలాగానే ఎనిమిదవ సీజన్లో కూడా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు నామినేషన్స్ ఎలిమినేషన్ అంటూ హౌస్ మొత్తం ఎంతో వాడి వేడిగానే ఉంది.


 ఈ క్రమంలోనే బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా తమకు నచ్చిన వారికి ఓటు వేసి ఎలిమినేషన్ నుంచి తప్పించాలని ప్రేక్షకులు బిజీ అయిపోయారు. కాగా ఇప్పుడు అటు బిగ్ బాస్ హౌస్ లో రేషన్ టాస్కులు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇద్దరు చీఫ్స్ కూడా తమ టీమ్స్ తో కలిసి రేషన్ కోసం టాస్కులు ఆడటం మొదలుపెట్టారు. అయితే నిఖిల్ టీం వరుసగా టాస్కులలో విన్ అవుతూ వచ్చింది. దీంతో వారికి ఎక్కువ రేషన్ లభించింది. వారితో పోల్చి చూస్తే అభయ్ టీం కి తక్కువ రేషన్ లభించింది అని చెప్పాలి.


 అయితే ఆ తర్వాత హౌస్ లో కిచెన్ ఉపయోగించడం పై కొత్త రూల్స్ పెట్టాడు బిగ్ బాస్. రోజుకు కేవలం 14 గంటలు మాత్రమే కిచెన్ ఉపయోగించుకోవచ్చని తెలిపాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయంపై ప్రోమో రిలీజ్ చేశారు. ఇప్పటినుంచి కిచెన్ లో కొత్త రూల్ వచ్చింది. కిచెన్లో ఒక సమయంలో ఒక టీం సభ్యులు మాత్రమే వంట చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక టీం వంట చేస్తున్న సమయంలో ఆ టీం నుండి కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే కిచెన్ లో ఉండాలి. ఇందులో కూరగాయలు కోయడం కూడా పరిగణలోకి వస్తుంది అంటూ బిగ్ బాస్ ఆదేశాలు ఇవ్వగా.. ఇక ఈ రూల్స్ పై అభయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రూల్స్ రాసేవారు మనిషి పుట్టుక పుట్టారా లేదా నాకు అర్థం కావట్లేదు. అంతమందికి ముగ్గురే ఎలా వండుతారు. మైండ్ లేదు. తినడానికి టాస్కులు పెడుతున్నామా తినకుండా ఉండడానికి టాస్కులు పెడుతున్నారా అంటూ కోపంగా లేచి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇలా బిగ్ బాస్ నిర్వాహకులనే అభయ్ మనుషులకే పుట్టాడా అని తిట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: