మొన్న సంక్రాంతికి గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు నెక్ట్స్ మూవీ కోసం మరో ఐదేళ్లు ఎదురుచూడాల్సిందేనని అభిమానులు ఆందోళన పడుతున్నారు. అందుకే ప్రతి సంవత్సరం మహేష్ బాబు హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసుకుంటూ తృప్తిపడుతున్నారు. రీసెంట్ గా ఇరవై ఏళ్ల క్రితం రిలీజయిన మురారి చిత్రం రీరిలీజ్ లోనూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. మహేష్ బాబుకు లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందుకే ఆయన సినిమాలన్నీ మాస్ యాంగిల్ లో ఉన్నా ఫ్యామిలీ సెంటిమెంట్ తప్పకుండా ఉంటుంది. మహేష్ కూడా మొదట్లో ప్రయోగాత్మక చిత్రాలు చేసినా ఆ ప్రయోగం బెడిసికొట్టడంతో

 కొంత కాలం నుంచి అలాంటి సినిమాల జోలికి వెళ్లడం లేదు.  దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఇండస్ట్రీలో , అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న #SSMB29 అప్‌డేట్స్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అన్నింటికి మించి రాజమౌళీ లాస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా.. మహేశ్ సినిమా కోసం జక్కన్న ఎంత ఖర్చు పెట్టిస్తున్నాడోనని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

  ఇదిలవుండగా ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ గెస్ట్ గా మహేష్ బాబు రానున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తారక్.. మహేష్ ను మొదటి నుంచి అన్నల ఫీలవుతుంటారు. మహేష్ కూడా తన సొంత మనిషిలా ఎన్టీఆర్ను ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇక కొరటాల, మహేష్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో మహేష్ బాబు కూడా ఈవెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ తెలుస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: