అవును.... మీరు విన్నది నిజమే. హౌస్ లో ఉన్న మొత్తం కంటెస్టెంట్లను బిగ్ బాస్ వెళ్లిపోమని ఏకంగా డోర్లు తెరిచేసాడు. బిగ్ బాస్ 8 విజయవంతంగా మూడో వారంలోకి అడుగు పెట్టింది. ఈ వారంలో ముఖ్యంగా గుడ్లను సేకరించే టాస్క్ జనాలను రంజింపజేసింది. ఈ పోటీలో కంటెస్టెంట్లు మొత్తం పోటా పోటీగా ఆడటం జరిగింది. అభయ్ నవీన్ టీం సభ్యులు అయినటువంటి యశ్మీ, ప్రేరణ గట్టి పోటీనే ఇచ్చారు. వీరిద్దరి ఆట చాలా ఆసక్తికరంగా సాగింది. అయితే ఇక్కడ ప్రేరణ చేతిలో ఉన్న బుట్టని విష్ణు ప్రియ కాలుతో తన్నడం వివాదాస్పదం అయింది.

సాధారణంగా విష్ణు ప్రియకి సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో, అంతే ట్రోలింగ్ కూడా ఉంది. ఇక ఈ దృశ్యం చూసిన జనాలు విష్ణు ప్రియనే దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే విషయం ఏంటని ఆమెని అడిగినప్పుడు, ప్రేరణ తనని మాటలతో రెచ్చగొట్టిందని చెప్పుకు రావడం గమనార్హం. ఈ క్రమంలోనే అభయ్ నవీన్ టాస్క్ విషయంలో, ఏకంగా బిగ్బాస్ పైన విమర్శలు గుప్పించాడు. ఇలాంటి తొక్కలోని గుడ్ల కాంపిటీషన్ ఏమిటి? బుర్ర లేని వారే ఇలాంటి టాస్కులు ఇస్తారు... అంటూ మండిపడ్డాడు. ఇక ఈ విషయానికి కాలిన బిగ్ బాస్ ఒకసారిగా హౌస్ డోర్స్ తెరచి, నచ్చితే హౌస్ లో ఉండండి... లేదంటే ఇక్కడినుండి దొబ్బేయండి! అంటూ కంటెస్టెంట్లకు షాక్ ఇచ్చాడు. దాంతో కంటెస్టెంట్లకు కళ్ళు బైర్లు కమ్మాయి.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ అభయ్ నవీన్ తో పాటు మిగతా వారికి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారని మర్చిపోవద్దు. ఇదేమీ మీ సొంతిల్లు కాదు. ఇక్కడ బిగ్ బాస్ రూల్ చేస్తాడు. చెప్పింది వినడమే నీ పని.. అంతకుమించి ఎక్కువ ఎవరైనా మాట్లాడితే, ఎలిమినేషన్ లేకుండానే బయటికి పోతారు జాగ్రత్త! అంటూ హుకుం జారీ చేశాడు. దాంతో గర్వం దిగిన అభయ నవీన్ బిగ్ బాస్ కి సారీ చెప్పాడు. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరిగితే ఇన్ఫర్మేషన్ లేకుండా బయటికి గెంటేస్తాను... గుర్తుపెట్టుకోండి! అని బిగ్ బాస్ కంటెస్టెంట్లను హెచ్చరించాడు. దాంతో కంటెస్టెంట్స్ మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: