స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్, జూనియర్ ఎన్టీఆర్  కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారు చెప్పాల్సిన పనిలేదు.. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత కాస్త ఆలస్యం అవుతోంది. తాజాగా దేవర సినిమా ప్రమోషన్స్లో ఎన్టీఆర్ ntr -31 చిత్రానికి సంబంధించి అప్డేట్ గురించి తెలియజేశారు. ప్రశాంత్ నీల్ తో సినిమా అక్టోబర్ 21 నుంచే మొదలవుతుంది అంటూ తెలియజేశారు.



అలాగే మొదటి షెడ్యూల్ ని 40 రోజుల పాటు చేస్తారని అందులో తాను ఇప్పుడే నటించిననీ.. ఇతర నటీనటులకు సంబంధించిన సినిమా షూటింగ్ జరుగుతుందంటూ తెలిపారు. తాను వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న పోతున్నట్లు తెలియజేశారు. అలాగే ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తిగా అయిపోయిన తర్వాతే మళ్ళీ దేవర-2 లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆకాశమున్నట్లుగా సమాచారం.


ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రెండవ చిత్రంగా వస్తోంది దేవర.. పాన్ ఇండియా లేవల్లో ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్లతో ప్రమోషన్స్ తో చిత్ర బృందం ఫుల్ బిజీగా ఉన్నది. దేవర చిత్రానికి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చాలా గ్రాండ్గా చేయబోతున్నారట. ఇందుకు సంబంధించి పలువురు సెలబ్రిటీలు కూడా గెస్ట్ గా రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దేవర  విషయానికి వస్తే ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో కూడా నటిస్తున్నారు. సరికొత్త కదా అంశంతో టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. పాటలు ఇప్పటికే యూట్యూబ్లో ట్రెండీగా మారాయి.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ ని ఢీకొట్టే  పాత్రుడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అన్నీ కుదిరితే దేవర-2 సినిమా కూడా వచ్చే ఏడాది పూర్తి చేసి రెండు చిత్రాలను ఒకే ఏడాది విడుదల చేసేలా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఇది ఎన్టీఆర్ అభిమానులకు  డబుల్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: