స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక నాగ చైతన్యాలు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.పెళ్లి చేసుకునే పట్టుమని నెల తిరగకుండా విడాకులు తీసుకున్నారు వీరిద్దరూ. ప్రస్తుతం నాగచైతన్య మరో అమ్మాయిని వివాహం చేసుకుంటున్నా సంగతి తెలిసిందే. సమంత మాత్రం అలాగే ఉంది. స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య తో విడాకులు తీసుకున్నప్పటి నుంచి మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఈ వ్యాధి కారణం గా ఆమె ఏడాది నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. చికిత్స తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటుంది. అయితే ఇటీవల సమంత ఓ పాడ్ కాస్ట్  మొదలెట్టి అందులో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుపుతోంది. అంతేకాకుండా పలు పోస్టులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని కోరడంతో బంగారం మూవీ ప్రకటించింది. ఇక ఆ తరువాత నుంచి సేమ్ సినిమాల గురించి ఎలాంటి పోస్ట్ పెట్టలేదు.

దీంతో ఫాన్స్ సమంత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేటట్టు లేదని నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో... తాజాగా, శామ్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ ప్రకటిస్తూ పోస్ట్ పెట్టింది. " కలలు కనటం ఎప్పుడూ ఆపవద్దు. కొంతకాలం తర్వాత మళ్లీ సినిమా సెట్స్ పైకి రావటం ఆనందంగా ఉంది" అనే క్యాప్షన్ జత చేసి కాఫీ కప్ ఓ బుక్ ఉన్న పిక్ షేర్ చేసింది. ప్రస్తుతం సమంతా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... అది చూసినా సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు ఆల్ ది బెస్ట్ తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఈ వార్త నెట్టెంటా వైరల్ గా మారింది. ఇది చూసిన పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: