తారక్ అభిమానులు ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. వీలైనంత ఎక్కువమంది జూనియర్ అభిమానులు పాల్గొనే విధంగా ఈ ఈవెంట్ ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ఏ  టాప్ హీరోని పిలవడం లేదు. జూనియర్ తో సన్నిహితంగా ఉండే రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రశాంత్ నీల్ ను ఈ ఈవెంట్ కు అతిధులుగా పిలవడం జరిగింది అని తెలుస్తోంది.



ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ ను వీలైనంత ఎక్కువ హైలెట్ చేసి ఈ మూవీ పై క్రేజ్ ను మరింత పెంచాలి అన్న వ్యూహ రచనలు ఈ మూవీ యూనిట్ చేస్తున్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం గురించి అతడి ప్రతిభ గురించి అందరికీ తెలిసే విధంగా ఈ ఈవెంట్ కు హాజరు కాబోతున్న దర్శకుల చేత చెప్పించి ఈ మూవీ పై మరన్ని అంచనాలు పెరిగే విధంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ ఉంది అని అంటున్నారు.



అయితే సాధారణంగా టాప్ హీరోల సినిమాల ఫంక్షన్స్ కు అతిధులుగా టాప్ హీరోలు రావడం పరిపాటి. దీనికితోడు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో జూనియర్ రామ్ చరణ్ తో కలిసి నటించిన నేపధ్యంలో ముఖ్య అతిధి స్థానంలో చిరంజీవి లేదంటే కనీసం రామ్ చరణ్ అయిన ఉంటాడని చాలామంది భావించారు. అంతేకాదు ఈ ఈవెంట్ కు బాలకృష్ణ అతిధిగా వస్తే బాగుంటుందని కొందరు ఈ మూవీ నిర్మాతలకు సూచన చేసినట్లు తెలుస్తోంది. అయితే వాస్తవం వేరు.



ఈ సినిమాకు ఏటాప్ హీరో అతిధిగా రాడని లీకులు వస్తున్నాయి. కేవలం జూనియర్ కు అత్యంత సన్నిహితులైన త్రివిక్రమ్ రాజమౌళిల ఉపన్యాసాలతో ఈ ఈవెంట్ క్లోజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని అంతా రెండు ప్రముఖ న్యూస్ ఛానల్స్ లైవ్ గా టెలికాస్ట్ చేస్తారని తెలుస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: