టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి తారక్ కొన్ని సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన టెంపర్ అనే మూవీ లో హీరో గా నటించిన మంచి విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందించాడు. ఇక ఆయన అందించిన కథతో బ్లాక్ బాస్టర్ కొట్టిన జూనియర్ ఆయన కథతో , ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా వక్కంతం వంశీ , తారక్ కి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే మూవీ కథను వినిపించాడట.

కథ విన్న తర్వాత మరికొన్ని రోజుల్లో నా ఒపీనియన్ చెబుతాను అని తారక్ అన్నాడట. కథ చెప్పిన తర్వాత ఎయిర్ పార్ట్ నుండి ఇంటికి వచ్చే క్రమంలో అల్లు అర్జున్ , వంశీ కి కలిసాడట. వంశీ ఏం చేస్తున్నావ్ ..? నెక్స్ట్ ఎవరితో మూవీ చేస్తావు అని అడగ్గా. నా కథతో తారక్ తో ఓ సినిమా చేయాలి అనుకుంటున్నాను. రీసెంట్ గా కథను కూడా చెప్పాను అన్నాడట. దానితో నాకు ఒక సారి ఆ కథ చెప్తావా అనగా కథ మొత్తం చెప్పాడట. దానితో కథ సూపర్ గా ఉంది అని అన్నాడట. ఇక ఆ తర్వాత కొంత కాలానికి బన్నీ తారక్ కి ఫోన్ చేసి సూపర్ కథ పెట్టావు. నేను ఆ కథ విన్నాను. సూపర్ గా ఉంది అన్నాడట. కానీ తారక్ మాత్రం పెద్దగా ఏమి స్పందించలేదట.

ఆ తర్వాత బున్ని కి తెలిసింది ఏమిటి అంటే తారక్ ఆ కథతో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. ఇక అప్పటికే బన్నీ కి ఆ కథ సూపర్ గా నచ్చడంతో ఆ కథతో ఆయన సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. ఇక ఆ కథ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ కథ అని సమాచారం. అలా తారక్ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కథను రిజెక్ట్ చేస్తే అది అద్భుతంగా నచ్చడంతో బన్నీ ఆ స్టోరీ తో మూవీ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: