రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ నటించిన సినిమాలకి హిట్ , ఫ్లాప్ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా భారీ కలెక్షన్లను వసూలు చేస్తున్నాయి. అలాగే కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ రికార్డులను సృష్టిస్తున్నాయి. కొంతన్కాలం క్రితం ప్రభాస్ "ఆది పురుష్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్గా నటించగా , ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మొదటి నుండి ఈ సినిమాపై నెగిటివ్ బజ్ నెలకొని ఉంది.

దానితో మామూలు అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక అదిరిపోయే రికార్డును సొంతం చేసుకుంది. అదేమిటి అనుకుంటున్నారా ..? అసలు విషయం లోకి వెళితే ... రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మొదటి రోజు అత్యధిక షేర్ కలెక్షనను వసూలు చేసిన టాప్ 10 సినిమాల లిస్టులో ఆది పురుష్ ఘోరమైన ప్లాప్ టాక్ తో స్థానాన్ని దక్కించుకుంది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 32.84 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 9 వ స్థానంలో నిలిచింది.

ఇలా ఫ్లాప్ టాక్ వచ్చిన మూవీ తో కూడా ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేర్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక ప్రభాస్ ఆది పురుష్ మూవీ తర్వాత సలార్ , కల్కి 2898 AD సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు మూవీ లు కూడా అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: