ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు సంబంధించి రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జానీ మాస్టర్ రిమాండ్ లో తన నేరాన్ని ఒప్పుకున్నట్లుగా సమాచారం. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ ఆ యువతని తన దగ్గర అసిస్టెంట్ గా చేర్చుకున్నారని తెలుస్తోంది. 2020లో ఆ అమ్మాయిపై పలుమార్లు దాడికి పాల్పడినట్లుగా జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో అంగీకరించారు.


తొలిసారి లైంగిక దాడి జరిగినప్పుడు ఆ యువతి 16 సంవత్సరాలు అని పోలీసులు తెలియజేశారు. గత నాలుగేళ్లుగా బాధితురాలిపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు జానీ మాస్టర్ ఒప్పుకున్నట్టుగా రిమాండ్ రిపోర్టులో ఉందని సమాచారం. జానీ మాస్టర్ కేసులో బాధితురాలు మొదట ఆయన భార్య అయేషాపై కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసింది.


బాధిత మహిళను మతం మారి వివాహం చేసుకోవాలని, తనని వేధించిందని, అంతేకాకుండా పలుమార్లు దాడి చేసేదని, బెదిరించేదని బాధిత మహిళ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. అయితే తాజాగా మరోసారి జానీ మాస్టర్ భార్య ఆయేషాపైన పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. జానీ భార్య  యువతి ఇంటికి వెళ్లి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించిందట. ఈ కారణంతోనే జానీ మాస్టర్ భార్యపై కూడా మరో కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమైనట్టు సమాచారం.  

ఇది ఇలా ఉండగా... తాజాగా జానీ మాస్టర్ భార్యకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. తన భర్తకు దగ్గరవుతున్న నేపథ్యంలో ఆ బాధ్యత మహిళను కొట్టేందుకు వెళ్లానని స్వయంగా జానీ మాస్టర్ భార్య వెల్లడించింది. ఈ వీడియో ఆధారంగానే పోలీసులు కేసు పెట్టే ఛాన్స్ ఉందట. జానీ మాస్టర్ భార్యతో పాటు మరో ఇద్దరి పైన కూడా కేసు నమోదు కానుందట.  ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాధిత మహిళకు న్యాయం జరగాలంటూ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: