బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సీజన్ బుల్లితెరపై విజయవంతంగా దూసుకు పోతోంది. కంటెస్టెంట్ అందరూ చాలా చురుకుగా, తెలివిగా గేమ్ ఆడుతున్నారు. ఇప్పటికే రెండు నామినేషన్లు పూర్తి కాగా, నేడు మూడో నామినేషన్ ప్రక్రియలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం పైన ఓ క్లారిటీ రానుంది. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు పైన సీరియస్ అయి, హౌస్ డోర్స్ ఓపెన్ చేసి మరి... ఇష్టం లేనివారు బయటికి వెళ్లిపోవచ్చు! అనే మాటను చెప్పిన సంగతి అందరికీ తెలిసినదే. కోడిగుడ్లు ఆటలో భాగంగా కంటెస్టెంట్స్ ఆడిన మాటలకు బిగ్ బాస్ ఈ విధంగా సీరియస్ అయ్యారు. కాగా నేడు ముచ్చటగా మూడోసారి బిగ్ బాస్ హౌస్ లో నుండి ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనే విషయం తెలియనుంది.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్న కాంటెస్టెంట్లు అందరిలో ఎవరు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు? అనే విషయం పైన సోషల్ మీడియాలో బిగ్ బాస్ వీక్షకులు తెగ డిబేట్స్ పెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ పేరు బాగా వినబడుతుంది. సదరు కంటెస్టెంట్ ఎవరు కూడా ఊహించలేని విధంగా రెమ్యూనరేషన్ తీసుకోబోతోంది అనే న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆమె ఎవరంటే? సోషల్ మీడియాలో తనదైన స్టెప్స్ వేస్తూ డాన్సులు ఇరగదీసిన యాంకర్ విష్ణు ప్రియ అని టాక్ వినబడుతోంది.

అయితే ఇది అధికారిక విషయం కానప్పటికి, ఎక్కువమంది బిగ్ బాస్ వీక్షకులు విష్ణు ప్రియ కె ఓటింగ్ చేస్తున్నట్టు టాక్ వినబడుతుంది. ఈ నేపథ్యంలోనే విష్ణు ప్రియ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. విష్ణు ప్రియ గురించి అందరికీ తెలిసిందే. యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన విష్ణు ప్రియ ఎన్నో ప్రయాసలుకోర్చి సోషల్ మీడియాలో తనకంటూ ఓ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె చేసిన కొన్ని పాటలు కొన్ని వందల మిలియన్స్ వ్యూస్ సంపాదించుకున్నాయి. ఇక్కడ ఓ పాట గురించి ప్రస్తావించుకోవాలి... "జరీ జరీ పంచి కట్టి" అనే పాట యూట్యూబ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఓ రకంగా చెప్పాలంటే, యాంకరింగ్ కెరీర్ కంటే కూడా ఈ పాటలు ఆమెకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. కట్ చేస్తే ఈరోజు ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఒక ముఖ్యమైన కంటెస్టెంట్ గా తన ఉనికిని చాటుకుంటుంది. అదృష్టం కాస్త ఆమెకి కలిసొస్తే ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఆమె విన్నర్ కావచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: