తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి ఎవరి అండ దండలు లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. అలాగే కెరియర్ను ఇప్పటికి కూడా స్టార్ హీరో గానే ముందుకు సాగిస్తున్నాడు. చిరంజీవి కెరీర్ లో చాలా పెద్ద డ్రీమ్ ప్రాజెక్టుగా సైరా నరసింహా రెడ్డి మూవీ ఉండేది. ఈ సినిమాను చేయాలి అని పలుసార్లు చిరంజీవి అనుకున్న కూడా కుదరలేదు.

ఇక రీ ఎంట్రీలో భాగంగా ఎలాగైనా సైరా నరసింహా రెడ్డి మూవీ ని చిరంజీవి రూపొందించాలి అనుకున్నాడు. ఇక తన తండ్రి చిరంజీవి కోరికను నెరవేర్చడానికి రామ్ చరణ్ రంగంలోకి దిగి భారీ బడ్జెట్ తో సైరా నరసింహా రెడ్డి మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించగా , సురేందర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించాడు. నయనతార , తమన్నా హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ లో అమితాబ్ బచ్చన్ , జగపతి బాబు ,  విజయ్ సేతుపతి , కిచ్చా సుదీప్ మరి కొంత మంది నటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా అంటే రజనీ కాంత్ భార్యకు ఎంతో ఇష్టం అట.

చిరంజీవి ఒకానొక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. సైరా నరసింహా రెడ్డి సినిమా వచ్చాక ఓ రోజు రజనీ కాంత్ నాకు ఫోన్ చేశాడు. సినిమా అద్భుతంగా ఉంది అని చెప్పాడు. రజినీ కాంత్ ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఆయన భార్య ఫోన్ తీసుకొని మూవీ సూపర్ గా ఉంది. నిన్ననే చూశాను. ఎంతో అద్భుతంగా అనిపించింది అని చెప్పింది. అలా వారిద్దరూ నా సినిమా బాగుంది అనడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: