గత మూడు రోజుల నుంచి తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు గురించే ఇప్పుడు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా జరుగుతోంది. అక్కడ నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుతో లడ్డూలను తయారు చేశారని అంశం తెరపైకి రావడంతో ఒక్కసారిగా ఈ విషయం కనకలాన్ని రేపింది హిందువులను.. దీనిపైన సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా నిన్నటి రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ప్రస్తావిస్తూ ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది. తిరుపతి లడ్డు ఘటన పైన కూడా విచారణ జరపాలని దోషులను కఠినంగా శిక్షించాలని ప్రకాష్ రాజ్ తెలిపారు.


కానీ ఈ సంఘటన పైన ఎందుకు ఆందోళన వ్యాప్తి చెందేలా చేయిస్తున్నారని ఈ సమస్య జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ వెల్లడించారు.. ఇప్పటికే మన దేశంలో మతపరమైన ఉద్రిక్తలు చాలానే చెలరేగుతున్నాయి కేంద్రంలో మీ స్నేహితులకు చెప్పి వీటి పైన విచారణ చేయించాలి అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ ఒక పోస్ట్ చేశారు. అయితే ఈ ట్విట్ కు మా అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు కౌంటర్ వేస్తూ.. ప్రకాష్ రాజ్ దయచేసి నిరుత్సాహం, అసహనం ఉండవద్దుని తిరుమల లడ్డు కేవలం ప్రసాదం మాత్రమే కాదని తమలాంటి లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక అంటూ తెలిపారు.


పవిత్రమైన దేవాలయంలో లడ్డు వివాదానికి సంబంధించి విచారణ జరిపి బాధితుల  పైన చర్యలు తీసుకోవాలంటు ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు అంటూ తెలిపారు.ఇలాంటి వ్యవహారాలలో మీరు ఉంటే మతం ఏ రంగు పులుముకుంటుందో తెలుసు..మీ పరిధిలోని మీరు ఉండండి అంటూ ప్రకాష్ రాజ్ కు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు మంచు విష్ణు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే మా ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ ,మంచు విష్ణు మధ్య ఒక వార్ జరుగుతూనే ఉంది.. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం మీద సెటైర్లు వేయడంతో ఆయనకు అండగా మంచు విష్ణు సపోర్ట్ చేస్తున్నారు.. అయితే కావాలని ప్రకాష్ రాజ్ పైన  మా అధ్యక్షుడు మంచు విష్ణు సెటైరికల్ గా వేసినట్లుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: