ఎన్టీఆర్ దేవ‌ర మూవీ సెప్టెంబ‌ర్ 27న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. జ‌న‌తా గ్యారేజ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ త‌ర్వాత ఎన్టీఆర్‌, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీతో జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. రిలీజ్‌కు మ‌రో వారం రోజులు ఉండ‌గానే ఓవ‌ర్‌సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌తో దేవ‌ర రికార్డులు క్రియేట్ చేస్తోంది. శుక్ర‌వారం నాటికి దేవ‌ర ఓవ‌ర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప‌ద‌కొండు కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. రిలీజ్ వ‌ర‌కు రెండు మిలియ‌న్ల అడ్వాన్స్ బుకింగ్స్ (దాదాపు

 ప‌ద‌హారు కోట్లు) టార్గెట్ రీచ్ కావ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఓవ‌ర్‌సీస్‌లో హ‌య్యెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగిన టాప్ ఫైవ్ తెలుగు మూవీస్‌లో ఒక‌టిగా దేవ‌ర నిల‌వ‌డం ఖాయ‌మ‌ని అంటోన్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలతో ఆసక్తికర విషయాలు పంచుకుంటుండగా.. తాజాగా జ‌న‌తా గ్యారేజ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ త‌ర్వాత ఎన్టీఆర్‌, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న   'దేవర'  కోసం వర్క్‌ చేసిన ఛాయాగ్రాహకుడు రత్నవేలు వీఎఫ్‌ఎక్స్‌పై పెట్టిన పోస్ట్‌ అందరి అంచనాలను రెట్టింపు చేసింది.  యాక్షన్‌ డ్రామాగా రానున్న ఈ సినిమాలో వీఎఫ్‌క్స్‌కు పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఛాయాగ్రాహకుడు రత్నవేలు సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు. ''దేవర' కలర్‌ గ్రేడింగ్‌,

 మ్యాచింగ్‌ భారీ వీఎఫ్‌ఎక్స్‌ షాట్‌ కోసం 30 రోజులకు పైగా నిద్రలేని రాత్రులు గడిపాం. ప్రీమియర్‌ లార్జ్‌ ఫార్మట్‌, డీ బాక్స్‌, 4డీఎక్స్‌, ఓవర్సీస్‌2.35ఎమ్‌ఎమ్‌ కంపెనీలు కంటెంట్‌ను సరైన సమయానికి అందించాయి. మా దేవరను థియేటర్‌లలో చూసి ఆనందించండి' అని రత్నవేలు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోతో పాటు.. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌కు సంబంధించిన పిక్‌ను షేర్‌ చేశారు. అలా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: