బిగ్ బాస్ సీజన్ 8 లో శన్వీఅరం ఎపిసోడ్ వచ్చింది అంటే నాగార్జున కోసమే ఆడియన్స్ ఎదురుచూస్తుంటారు. హోస్ట్ గా నాగార్జున తన మార్క్ చూపిస్తూ వస్తున్నారు. సీజన్ 8 లో ఇప్పటికే రెండు వారాలు పూర్తి కాగా 3వ వారం మొదటి వీకెండ్ అదే శనివారం నాగార్జున ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎప్పటిలానే వారం మొత్తం జరిగిన విషయాల మీద నాగార్జున హౌస్ మేట్స్ కి క్లాస్ పీకారు. ఐతే సీజన్ 8 లో మొదటి సారి నాగార్జున కంటెస్టెంట్ అభ్య నవీన్ కు రెడ్ కార్డ్ చూపిస్తూ అతన్ని హౌస్ నుంచి బయటకు పంపించాలని అనుకున్నారు.

బిగ్ బాస్ పట్ల, హౌస్ నియమాల పట్ల, టాస్కుల పట్లా ఇలా ప్రతి విషయంలో అభయ్ బిగ్ బాస్ రూల్స్ ని అతిక్రమించాడు. అంతేకాదు బిగ్ బాస్ ని కించపరుస్తూ మాట్లాడాడు. అది సరదాగా అన్నాడని అభయ్ అంటున్నా చూసే ఆడియన్స్ కి అది ఇబ్బంది కలిగించింది. నాగార్జున కూడా బిగ్ బాస్ చెప్పిందే వేదం అన్నట్టుగా అభయ్ కి వార్నింగ్ ఇచ్చాడు.

ఫైనల్ గా హౌస్ మెట్స్ రిక్వెస్ట్ తో అతన్ని ఇంట్లోనే ఉంచారు. ఐతే ఈ వారం నామినేషన్స్ లో అభయ్ కూడా ఉన్నాడు. అతనే ఈ వారం ఎలిమినేట్ అవుతున్నాడని ఆల్రెడీ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఇక వారం మొత్తం జరిగిన గుడ్ల టాస్క్ గురించి నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్స్ కు వారు చేసిన తప్పులు చెబుతూ వారిని మందలించాడు. సీజన్ 8 లో నాగార్జున ఇంత సీరియస్ గా మాట్లాడిన మొదటి ఎపిసోడ్ ఇదే అని చెప్పొచ్చు. ఓ పక్క ప్రేరణ, విష్ణు ప్రియల మధ్య దూరాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేశారు నాగార్జున. వారిద్దరికి కూడా కులాయి దగ్గర లేడీస్ కొట్టినట్టుగా మీ బాష ఉందని దాన్ని మార్చుకోవాలని నాగార్జున చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: