యంగ్ టైగర్ ఎన్టీఆర్ , డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లు మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం దేవర. జాన్వీ కపూర్ ఎన్టీఆర్కు జోడిగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర సినిమా పైన భారీ హైప్స్ నెలకొన్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలోని సినిమా టికెట్ల ధర కూడా భారీగానే పెంచేశారు. ఒకవైపు అభిమానులు హంగామా చేస్తూ ఉంటే మరొకవైపు దేవర ఫస్ట్ రివ్యూ అంటూ ఒక న్యూస్ బయటకి వచ్చేసింది.



ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున దేవర సినిమా రిలీజ్ కాబోతోంది. శుక్రవారం మిడ్నైట్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బెనిఫిట్స్ షోలు రాబోతున్నాయి. రాజమౌళి ఎన్టీఆర్ ఎంతటి మిత్రుల ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి దేవర సినిమాని ఇటీవలే చూసినట్లుగా సమాచారం. అయితే ఆయన చెప్పిన ప్రకారం సెకండాఫ్ హైలెట్ గా ఉందని చివరి అరగంట అయితే నెక్స్ట్ లెవెల్ లో ఎన్టీఆర్ పూనకాలు తెప్పిస్తారంటూ చెప్పారట. ఈ విషయం ట్రెండ్ వర్గాలతో పాటు అటు అభిమానులను కూడా చాలా ఆనంద పరిచేలా కనిపిస్తోంది.


గతంలో కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ సినిమా కూడా అలాగే ఉండబోతోంది ఏమో అన్నట్లుగా పలు రకాల రూమర్స్ వినిపించాయి. కానీ దేవర సినిమాతో కచ్చితంగా కొరటాల శివ బ్యాక్గ్రౌండ్స్ అవుతారంటూ అభిమానులైతే ధీమాతో తెలియజేస్తున్నారు. మరి దేవర సినిమా పైన ఆచార్య ఎఫెక్ట్ ఏ విధంగా పడుతుందో లేదో చూడాలి మరి. దేవర సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా కొరటాల శివ కూడా పాండ్ ఇండియా డైరెక్టర్గా పేరు సంపాదిస్తారు. ఎన్టీఆర్ ఇందులో మళ్లీ డ్యూయల్ పాత్రలో కనిపించబోతున్నారు. అనిరుద్ సంగీతం సినిమాకి హైలైట్ గా నిలవబోతోందట. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితర నటి నటులు నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: