టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. కొన్ని దశాబ్దాల నుండి ఆ ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చి స్టార్ హీరోలుగా హవా నడిపిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు ఇక తనదైన నటనతో ప్రేక్షకులకు గుండెల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. ఆ తర్వాత నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగార్జున మన్మధుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ఇప్పటికీ కూడా స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఇక ఆ తర్వాత నాగార్జున వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య, అఖిల్ లు మాత్రం ఎందుకో అక్కినేని  లాంటి భారీ బ్యాగ్రౌండ్ ఉన్న స్టార్ హీరోలుగా మాత్రం ఎదగలేక పోతున్నారు. ఇంకా గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి అంతో ఇంతో మంచి గుర్తింపుని సంపాదించుకున్న హీరో నాగచైతన్య అని చెప్పాలి. అందరిలా కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు ఈ అక్కినేని హీరో. అయితే ఇప్పుడు నాగచైతన్య గురించి నిర్మాత బన్నీ వాసు  ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.



 ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తండేల్ అనే సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా కోసం హీరో నాగచైతన్య అన్ని వదిలేసాడు అంటూ నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చాడు. నాగార్జున గారి అబ్బాయిని అనే ఫీలింగ్ నాగచైతన్యలో ఎక్కడ కనిపించలేదు. రాజు అనే పాత్ర కోసం ఏకంగా సాధారణ స్థాయికి వెళ్లిపోయాడు.  కామన్ మ్యాన్ కు కనెక్ట్ అయ్యే విధంగానే కామన్ మ్యాన్ లాగానే  నాగ చైతన్య ఉంటున్నాడు అంటూ బన్నీ వాసు చెప్పుకొచ్చాడు. పాత్ర కోసం అలా చేయడంతో షాక్ అయ్యా. ఇదివరకు చైతన్య వేరని ఇప్పుడు చైతు వేరు అంటూ చెప్పిన బన్నీ వాసు సినిమా పై భారీ రేంజ్ లోనే అంచనాలను పెంచేశాడు. కాగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ మూవీలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: