ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ వివాదం ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా సైడ్ డాన్సర్ స్థాయి నుంచి ఇక ఇప్పుడు ఇండియాలోనే టాప్ కొరియోగ్రాఫర్గా ఎదిగిన జానీ మాస్టర్ పై ఏకంగా అత్యాచార ఆరోపణలు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎన్నో ఏళ్లపాటు జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన ఒక లేడీ డాన్సర్ జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని పలుమార్లు దారుణంగా శారీరక దాడికి కూడా పాల్పడ్డాడు అంటూ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్లో కేసుపెట్టింది.


 అయితే బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిజానిజాలు తేల్చేందుకు అటు జానీ మాస్టర్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇటీవల కోర్టులో హాజరు పరచడంతో పాటు 14 రోజుల రిమాండ్ లో కూడా అటు జానీ మాస్టర్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ పోలీస్ కస్టడీలో ఉండగా  ఆయన భార్య ఆయేషా ఇక ఈ వివాదం పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ అత్యాచారం కేసు విషయంలో ట్విస్టులు తెరమీదకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి.



 ఇక ఇటీవల  మరో సంచలన విషయాన్ని కూడా బయటపెట్టారు టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య ఆయేషా. పలుమార్లు జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడు అంటూ లేడీ డాన్సర్ చెబుతుంది. కానీ ఇలా పలుమార్లు అత్యాచారం చేయడానికి ఆమె చిన్నపిల్ల కాదు. పెళ్లి చేసుకోమని ఆమె ఎప్పుడూ జానీ మాస్టర్ ను వేధిస్తూ ఉండేది. నా ముందు అన్నయ్య అని పిలిచి బయటికి వెళ్లగానే పెళ్లి గురించి ఆయనను ఒత్తిడి చేస్తూ ఉండేది అంటూ ఆయేషా సంచలన వ్యాఖ్యలు చేసింది. మతం మార్చుకుంటానని కూడా చెప్పేది. పెళ్లి చేసుకోమని బ్లాక్ మెయిల్  చేస్తూ వేధింపులకు కూడా గురిచేసింది. ఆమె కారణంగానే నేను ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని  కూడా ప్రయత్నించ అంటూ అయేషా సంచలన విషయాలను చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: