ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన దేవర సినిమా ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం ఎన్టీఆర్ అభిమానులంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి టికెట్ల రేట్లు పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27వ తేదీన ఆరు షోలు ప్రదర్శించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ వార్త ఎన్టీఆర్ అభిమానులకు కచ్చితంగా శుభవార్త అనే చెప్పాలి.


అయితే దేవర సినిమాకు పోటీగా తమిళంలో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి విజయ్ ఆంటోనీ హిట్లర్ సినిమా కాగా, మరొకటి కార్తీ హీరోగా నటించిన సత్యం సుందరం. 96 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సత్యం సుందరం. ఈ సినిమా టీజర్ చూడగానే ప్రతి ఒక్కరూ ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ లో రాబోతుందని అనుకుంటున్నారు.


అయితే ఈ సినిమా గురించి తాజాగా ఆడియన్స్ కు ఒక షాకింగ్ న్యూస్. దేవర సినిమాకు పోటీగా అంటే ఒకరోజు తర్వాత రాబోతున్న సత్యం సుందరం సినిమాలో ఫైట్స్, సాంగ్స్ ఎలాంటివి లేవట. ఈ విషయాన్ని ఆ సినిమా హీరో కార్తీ స్వయంగా చెప్పడం విశేషం. దీంతో దేవర ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ దేవర సినిమా క్లిక్ అవకపోతే కొరటాల శివ, అలాగే ఎన్టీఆర్ కు అవమానం తప్పదని అనుకుంటున్నారట.


ఇదిలా ఉండగా....దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటించింది. ఈ సినిమా విడుదలకు ముందే జాన్వి కపూర్ కు తెలుగులో మరిన్ని సినిమా అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా చేయబోయే సినిమాలో జాన్వికపూర్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ఇక దేవర సినిమాలోని కొన్ని పాటలు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి.  ఈ సినిమా విడుదలై ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: